నలుగురు యువనటులకు మోహన్బాబు వార్నింగ్
on Dec 3, 2016
ముక్కుసూటితనం..మొండితనం కలగలిస్తే అది మోహన్బాబు. ఎదుటివారు ఏమనుకున్నా తన మనసులో మాట ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఆయనకు అలవాటు. అలాగే క్రమశిక్షణ విషయంలో మోహన్బాబు పెదరాయుడు లాంటి వ్యక్తి. ఈ విషయంలో టాప్ హీరోలైనా, అగ్రదర్శకులైనా సరే లెక్క చేయడు. ఈ విషయంలో ఎంతోమందితో ఆయనకు బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ విషయంలో తన పిల్లలైనా..ఇతరుల పిల్లలైనా సరే రాజీ పడే ప్రసక్తే లేదు.
ఇందుకు నిదర్శనంగా గతంలో జరిగిన ఓ ఘటనను యువహీరో వరుణ్ సందేశ్ చెప్పారు. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో మోహన్బాబుతో పాటు ఆయన ఇద్దరు కొడుకులు విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ నటించారు. ఒకే వయసు వాళ్లు కాబట్టి ఈ యువహీరోలు చాలా సరదాగా ఉండేవారు. ఓ సమయంలో వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిశోర్లు గదిలో బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్నారు..
ఆ తర్వాత ఆ గదిలోకి వచ్చిన మంచు మనోజ్ సరదాగా ఎగిరి వారిపై పడ్డాడట. దీనిని చూసిన మోహన్ బాబు వారందరిని తన గదిలోకి రమ్మన్నారట. భయపడుతూ గదిలోకి వచ్చిన వాళ్లని వరుసలో నిలబెట్టి పెద్ద క్లాస్ పీకాడట మోహన్బాబు. అదేంటయ్యా...అలా పడుకున్నారు. సినిమా నటుడంటే ఎలా ఉండాలి. డిగ్నిఫైడ్గా ఉండాలయ్యా. ఇది మళ్లీ రిపీట్ అయ్యిందా..ఈ సారి వార్నింగ్ ఇవ్వను అంటూ హెచ్చరించాడట పెదరాయుడు.