మధ్యప్రదేశ్లో గౌతమిపుత్రుడి గర్జన..
on Aug 30, 2016
నటసింహం నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణీ శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మధ్యప్రదేశ్ చేరుకుంది. 18 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో బాలయ్య, శ్రీయ, హేమామాలిని తదితరులపై కొన్ని సీన్లను చిత్రీకరించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఫస్ట్ ప్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read