"ప్రవాసిరత్న"గా మారిన అల్లుఅర్జున్
on Aug 27, 2016
టాలీవుడ్ స్టైలీస్ స్టార్ అల్లుఅర్జున్కు తెలుగు హీరోల్లో ఎవరికి లేని బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కేరళలో ఉంది. మనోడీ డ్యాన్స్లు, నటన, స్టైల్ మలయాళీలను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో అక్కడ అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్గా మారిపోయాడు. రీసెంట్గా రిలీజైన సరైనోడు సినిమా అక్కడ పెద్ద హిట్టై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో బన్నీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖ మలయాళ ఛానల్ స్టార్ ఏషియానెట్ మిడిల్ ఈస్ట్ అల్లుఅర్జున్కు ప్రవాసి రత్న పురస్కారాన్ని ప్రకటించింది. నిన్న సాయంత్రం దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఓనం పండుగ సందర్భంగా జరిగిన పూనోనమ్-2016 కార్యక్రమంలో బన్నీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, దుబాయ్లోని కేరళ, తెలుగు ప్రజలు హాజరయ్యా