సింగపూర్ లో శ్రీమంతుడి హల్ చల్!
on Jul 1, 2016
ఇప్పటికే ఐఫా మరియు ఫిలిమ్ ఫేర్ అవార్డు వేడుకల్లో హల్ చల్ చేసిన "శ్రీమంతుడు" సినిమా, ప్రస్తుతం సింగపూర్ లో జరుగుతున్న "సైమా అవార్డ్స్"లోనూ సత్తా చాటుతోంది. "సైమా వేడుకల్లో" మహేష్ బాబు ఉత్తమ నటుడిగా నిలిచాడు. ఆన్ లైన్ పోలింగ్ పద్ధతి ద్వారా జరిగిన ఈ సెలక్షన్ లో మహేష్ బాబు అత్యధిక ఓట్లు గెలుచుకోవడం గమనార్హం. మహేష్ బాబు ఈ వేడుకలకు హాజరుకాకపోవడంతో.. ఆయనకు బదులుగా "శ్రీమంతుడు" చిత్ర బృందానికి సంబంధించినవారు సదరు అవార్డ్ ను అందుకొన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కు కథానాయకుడీగానే కాక నిర్మాతగానూ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ కు మాత్రమే కాక కీలకపాత్రలు పోషించిన జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ లకు కూడా ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోయింది. సినిమా విడుదలై ఏడాది పూర్తికావడానికి వస్తుండగా ఇప్పటికీ సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న "శ్రీమంతుడు" ఇంకెన్ని అవార్డులు అందుకోంటాడో చూడాలి!