ఆ హీరోకి నేను బోర్ కొట్టా...
on Jan 13, 2017
ఒకపక్క తెలుగు సినిమాలు చేస్తూ.. మరోపక్క తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది కీర్తీసురేశ్. టాప్ హీరోల సరసనే ఛాన్స్ లు కొట్టేస్తుంది ఈ లక్కీ హీరోయిన్. ప్రస్తుతం విజయ్తో నటించిన భైరవా చిత్రం విడుదలై ప్రేక్షక్షుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఓ పత్రికా సమావేశంలో పాల్గొన్న కీర్తీ సురేశ్ తనను అడిగిన ప్రశ్నలకు చాలా చిలిపిగా సమాధానాలు చెప్పారు. నటుడు శివకార్తికేయన్తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు అన్న ప్రశ్నను కీర్తి సురేశ్ ను అడుగగా దానికి ఈ అమ్మడు.. శివకార్తికేయన్కు నాతో నటించి బోర్ కొట్టిందని అనుకుంటున్నాను. రెమో చిత్రం తరువాత మా ఇద్దరికీ చిన్న గ్యాప్ అవసరం. ఆ తరువాత మళ్లీ కలిసి నటిస్తాం అని చెప్పారు. కాగా శివకార్తికేయన్తో రజనీమురుగన్, రెమో చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు సూపర్హిట్ అయ్యాయి. మరి వీరిద్దరి కాంబోలో మూడో సినిమా ఎప్పుడు వస్తుందో చూద్దాం..