ఆ మూడు అక్షరాలే మాకు అన్నీ..నాగార్జున
on Dec 18, 2014
అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2014 ప్రదానోత్సవం గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్లో జరిగింది. వివిధ రంగాల ప్రముఖులకు అవార్డుల ప్రదానంతోపాటు అక్కినేని కాంస్య విగ్రహావిష్కరణలో అక్కినేని కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఏఎన్ఆర్ అనే మూడు అక్షరాలే తమకు నాన్న, స్నేహితుడు, తత్వవేత్త అని అక్కినేని నాగార్జున తెలిపారు. నాన్న నాల్గవ తరగతి చదివినా... నాలుగు తరాలు గర్వించేలా జీవించారని గర్వంగా చెప్పారు. ఏఎన్ ఆర్ పిల్లలుగా తామెంతో గర్విస్తున్నామన్నారు. విద్యాలయాలను నాన్న ఎప్పుడూ దేవాలయాలుగా చూసేవారని అన్నారు. చిత్ర రంగంలో దర్శకుడు రాఘవేంద్రరావు, గుమ్మడి గోపాలకృష్ణ, శాస్త్ర, సాంకేతిక రంగానికి గాను డా.ఐ.కే. వరప్రసాద రెడ్డి, జ్యోతి సురేఖ, వంశీ రామరాజు, విద్యారంగంలో ఎంఎన్ రాజు, జస్టిస్ పర్వతరావు, ఆరోగ్య విభాగంలో సేవలందించిన డా. గోపీచంద్ మన్నం, పౌరసేవల విభాగంలో సంపత్ కుమార్ లు అక్కినేని పురస్కారాలు అందుకున్నారు.