విక్టరీ వెంకటేష్ కాదు... ఇక వెరైటీ వెంకీనట!
on Jan 18, 2017
బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి.ప్రస్తుతం నాగార్జున చేస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ఓం నమో వేంకటేశాయ.ఈ రెండూ దేనికదే విభిన్నం.ఇక బాలయ్య తన నూటా ఒకటవ చిత్రంగా చేయబోతోన్న రైతు సినిమా కూడా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు.ఈ విషయం ఇప్పటికే క్లియర్ అయిపోయింది.అయితే ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది?మన టాప్ హీరోలు రూటు మార్చినట్టు అనిపించటం లేదు!తాజాగా వెంకీ కూడా డిఫరెంట్ బాట పట్టే ఆలోచనలో వున్నాడట...
విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు.ఆయనకి ఆడాళ్లు చాలా మంది అభిమానులు కూడా వున్నారు.అందుకే,వెంకటేష్ చాలా వరకూ లవ్ స్టోరీలు,ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూ వచ్చాడు ఇంతకాలం.కాని,తన తోటి హీరోలు డిఫరెంట్ జానర్స్,డిఫరెంట్ మూవీస్ తో దూసుకుపోతుంటే ఇక లాభం లేదనుకున్నాడని ఇండస్ట్రీ టాక్.ఇక మీదట తన సీనియారిటీ తగ్గట్టుగా సమ్ థింగ్ డిఫరెంట్ సినిమాలే చేస్తాడట.అందుకోసం చేతిలో వున్న సినిమాని కూడా రిజెక్ట్ చేసి మరీ కొత్త పంథాలో పోయేందుకు సిద్ధమవుతున్నాడట.నేను శైలజ మూవీ రూపొందించిన దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన చేద్దామనుకున్న ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాకు నో చెప్పేశాడట.ఓ విభిన్నమైన సినిమా కోసం ఉత్సహంగా సిద్ధమవుతున్నాడట.
గౌతమీ పుత్ర శాతకర్ణీ లాంటి హిస్టారికల్ మూవీతో హిస్టరీ క్రియేట్ చేసిన క్రిష్ ఇప్పుడు వెంకీని డైరెక్ట్ చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.ఇక మీదట తన స్టార్ డమ్ కి తగ్గ సబ్జెక్ట్సే చేయాలనుకున్న వెంకీ మొదటి ప్రయత్నంగా కంచే దర్శకుడితో ఓ సోషియో ఫాంటసీ ప్లాన్ చేస్తున్నాడట.దీనిపై అఫీషియల్ కన్ ఫర్మేషన్ ఏమీ లేనప్పటికీ క్రిష్ అండ్ వెంకీ వెరైటీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ పక్కా అంటున్నారు ఇన్ సైడర్స్...