వణికిపోతున్న ప్రభాస్... పవన్కి బాణం దించిన రాజమౌళి...
on Jun 22, 2017
రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలి అని ఏ నటుడికుండదు. ఒళ్ళు పులిసిపోయేలా పనిచేయించినా ఆ కిక్కే వేరప్పా అనుకుంటుంటారు స్టార్ హీరోలు సైతం. ఏ హీరోకు దక్కని అదృష్టం ప్రభాస్ కి దక్కింది. ఛత్రపతి, బాహుబలి రెండు పార్టులు కలిపి మొత్తం మూడు సినిమాలకి రాజమౌళి తో కలిసి పనిచేసే అవకాశం దక్కింది ప్రభాస్ కి. జూనియర్ ఎన్టీఆర్ కూడా మూడు సినిమాలు చేసినా, ప్రభాస్ కి రాజమౌళితో ఎక్కువ సమయం పని చేసే అదృష్టం కలిగింది. బాహుబలి రెండు భాగాలకు కలిపి దాదాపు 6 సంవత్సరాలు కలిసి జర్నీ చేసారు. రాజమౌళి కూడా తన తదుపరి చిత్రం గ్రాఫిక్స్ లేకుండా మామూలు సినిమా తీద్దాం అని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే బాహుబలి హ్యాంగోవర్ నుండి బయటకు వస్తున్న రాజమౌళి రానా టాక్ షో నంబర్ 1 యారీ కి బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ తో కలిసి అతిధి గా విచ్చేసారు. షోలో భాగంగా, రాజమౌళి ప్రభాస్ కి ఫోన్ చేసి డార్లింగ్ నిన్ను అర్జెంటు గా కలవాలి అన్నాడు. దానికి ప్రభాస్ ఎందుకు డార్లింగ్ అంటే... బాహుబలి 3 గురించి మాట్లాడాలి అన్నాడు. దానికి ప్రభాస్ 'అమ్మడియమ్మ' అని తన ఆందోళన వ్యక్తం చేసాడు. బాహుబలి మీద ఏళ్ళు ఖర్చుపెట్టిన ప్రభాస్ ఇప్పటికిప్పుడు మళ్ళీ మూడవ భాగం కోసం కష్టపడటానికి సిద్ధంగా ఉన్నట్టు లేడు. అందుకే అలా బాహుబలి పేరు చెప్పగానే వణికిపోయాడు. ఇది ఇలా ఉంటే, షోలో ఇంకో విషయం ఏంటంటే రానా ఒక్కో పేరు చెప్పినప్పుడల్లా రాజమౌళి బాణం తో టార్గెట్ కి గురి పెట్టాలి. వేరే వాళ్ళ పేరు చెప్పినప్పుడల్లా గురి తప్పింది కానీ పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే సెంటర్ లో బాణం దించాడు రాజమౌళి. దాంతో అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానుల రచ్చ మొదలయ్యింది. ఇంతకీ రాజమౌళి తర్వాతి చిత్రం ఎవరితో? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!