వాళ్లు 'ప్రేక్షక దేవుళ్లు' ఎందుకయ్యారంటే..!
on Jan 10, 2020
"ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటుంటాం. థియేటర్లో లైట్లు ఆర్పిన తర్వాత కులం, మతం, జాతి.. వీటన్నిటికీ అతీతంగా తమ ముందున సినిమాని చూస్తారు. వాళ్లను ఏదీ ఆ టైంలో ఎఫెక్ట్ చెయ్యదు. నవ్వొస్తే నవ్వుతారు, ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు" అని చెప్పారు త్రివిక్రమ్. 'అల వైకుంఠపురములో' అనే టైటిల్ పెట్టడానికి పోతన పద్యమే స్ఫూర్తి అని తెలిపారు.
"ప్రేక్షక దేవుడంటే మనం తెలుసుకోవాల్సింది.. పొజిషన్ కాదు, కండిషన్. అదొక స్థితి. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక అమ్మాయిమీద యాసిడ్ పోస్తే వాడు దేవుడెలా అవుతాడు!" అని ఆయనంటారు. ప్రేక్షకులు అభిమానించేది పనినే కానీ, వ్యక్తిని కాదనేది ఆయన అభిప్రయాం. "ఆ విషయాన్ని డిటాచ్డ్గా చూస్తేనే, వాటినుంచి మనం విడిపోయి మనకు నచ్చిన పని చేసుకోగలం, లేకపోతే మరీ సీరియస్ అయిపోయి, స్తబ్దతకు గురవుతాం" అని అంటారు త్రివిక్రమ్. కాబట్టి ఆ సినిమావరకు తాను ప్రజల ఇష్టాన్ని పరిగణలోకి తీసుకుంటానని చెబుతారు. "నేను చేసిన ఏ సినిమా కూడా నచ్చలేదని జనం చెప్పారంటే, అప్పటిదాకా నేను చేసిన పని నేను చేసినట్లు కాదు, తర్వాత చేసేపని కూడా నేను చేసేది కాదు" అని త్రివిక్రమ్ అంటారు.