Home »
ఐపీఎల్ వివాదం రవిశాస్త్రికి సమన్లు
on Jul 21, 2011
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విషయంలో లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) మధ్య నెలకొన్న వివాదంలో ప్రశ్నించేందుకు గానూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు రవి శాస్త్రికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ భారత మాజీ కెప్టెన్ వచ్చే వారం ఈడీ ముందు హాజరవ్వాల్సిందిగా ఫ్యాక్స్ ద్వారా సందేశం పంపింది. అప్పటి ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ సారధ్యంలోని గవర్నింగ్ కౌన్సిల్లో శాస్త్రితో పాటు మాజీ సారధులు మన్సూర్ అలీఖాన్ పటౌడీ, సునీల్ గవాస్కర్ సభ్యులుగా ఉన్నారు. కౌన్సిల్ తరపున మూడు సంవత్సరాల పాటు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కాలంలో వీరు ఒక్కొక్కరు ఏడాదికి రూ.కోటి మొత్తాన్ని వేతనంగా తీసుకున్నట్లు సమాచారం.