నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన 'చెక్' మూవీ తొలిరోజు అంచనాలను అందుకోలేకపోయింది. ఫిబ్రవరి 26 శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.38 కోట్ల షేర్ సాధించింది. నితిన్ మునుపటి సినిమా 'భీష్మ' తొలి రోజు సాధించిన వసూళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. 'భీష్మ'కు ఫస్ట్ డే రూ. 6.28 కోట్ల షేర్ వచ్చింది! అంటే 'భీష్మ'తో పోలిస్తే 'చెక్'కు వచ్చిన ఓపెనింగ్ డే కలెక్షన్స్ 54 శాతమే.
రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన 'చెక్' మూవీకి తొలిరోజు నైజాంలో రూ. 1.46 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.45 కోట్లు, రాయలసీమలో రూ. 0.47 కోట్లు షేర్ వచ్చాయి. అదే 'భీష్మ'కు చూసుకుంటే, నైజాంలో రూ. 2.2 కోట్లు, ఆంధ్రాలో రూ. 3.28 కోట్లు, రాయలసీమలో రూ. 0.8 కోట్ల షేర్ వచ్చింది. దీన్ని బట్టి అన్ని ఏరియాల్లోనూ 'భీష్మ' కంటే 'చెక్' ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో వెనకబడిందని అర్థమవుతోంది. ఓవరాల్గా ప్రి బిజినెస్తో పోలిస్తే 'చెక్' మొదటి రోజు 23 శాతమే రికవర్ అయ్యిందని ట్రేట్ వర్గాలు తెలిపాయి.
రాసిన కథకు క్లైమాక్స్లో జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం ప్రేక్షకులకు నచ్చలేదనీ, నితిన్ నిర్దోషిగా నిరూపణ కాకుండా, జైలు నుంచి తప్పించుకోవడం ఆడియెన్స్ను ఎట్రాక్ట్ చెయ్యలేదనీ చెప్పాలి. ఓవరాల్గా ఈ మూవీ బ్రేకీవెన్ కావడం కష్టసాధ్యమంటున్నారు. ఏదేమైనా సోమవారం వచ్చే కలెక్షన్లు ఈ సినిమా ఫేట్ను డిసైడ్ చేయనున్నాయి.