రాఖీ పౌర్ణమి రోజున సిస్టర్స్ అందరూ బ్రదర్స్ గురించి గొప్పగా చెప్పారు. ప్రేమ, అనుబంధం, ఆప్యాయత ఎలా ఉంటాయో ప్రేక్షకులకు తెలిసేలా సెలబ్రిటీలు ఫొటోలు పోస్ట్ చేశారు. హీరోయిన్స్ తమ బ్రదర్స్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇద్దరు మాత్రం వెరైటీగా, డిఫరెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఒకరు తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ అయితే, మరొకరు తెలుగులో సైతం కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హన్సిక.
రాఖీ రోజున ఎవరైనా బ్రదర్తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఐశ్వర్య రాజేష్ మాత్రం బ్రదర్ హౌస్ క్లీనింగ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. అందులో అతడు మాప్ కొడుతున్నారు. బ్రదర్ను ఇరిటేట్ చేయడానికి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్టు ఐశ్వర్య రాజేష్ పేర్కొనడం గమనార్హం.
హన్సిక మోత్వానీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. మొదట బ్రదర్తో దిగిన ఫొటో హన్సిక పోస్ట్ చేశారు. తరవాత బ్రదర్ తన కాళ్లకు మొక్కుతున్న ఫొటో పోస్ట్ చేశారు. అందులో అభ్యంతరం ఏమి లేదు. ఆ తరవాత బ్రదర్ తనకు డబ్బులిస్తున్న ఫొటో పోస్ట్ చేసి, మావాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడమని అన్నారు. ఆ ఫొటో బ్రదర్ను ఆటపట్టించడానికి హన్సిక పోస్ట్ చేశారన్నమాట.