ఎన్టీయార్ కు జోడీగా శ్రద్ధాకపూర్..?
on Jan 31, 2018
ఎన్టీయార్ సినిమాను త్వరగా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. అందుకే... ఇందులో హీరోయిన్ ని సెట్ చేసే పనిలో పడ్డాడు. ఫిలింనగర్ లో బలంగా వినిపిస్తున్న వార్త ఏంటంటే... ప్రభాస్ ‘సాహో’ లో కథానాయికగా నటిస్తున్న శ్రద్ధాకపూర్ ను తన సినిమాలో కథానాయికగా నటింపజేయడానికి త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నాడట.
ఇప్పటికే కథను కూడా శ్రద్ధకు వినిపించేశాడనీ...ఆమె కూడా కథ విని సంతృప్తిగా ఫీలైందనీ... శ్రద్ధ కపూర్ దాదాపు ఇందులో కథానాయికగా ఖరారైనట్టేననీ ఫిలింనగర్ సమాచారం. అయితే.. ఈ విషయంలో త్రివిక్రమ్ నుంచి మాత్రం ఎలాంటి అధికార ప్రకటనా రాలేదు.
ఇదిలావుంటే... ఈ సినిమా మధుబాబు డిటెక్టీవ్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీయార్ పాత్ర ఇంతకు ముందు తాను టచ్ చేయని విధంగా ఉంటుందట. కథానాయిక పాత్ర కూడా మోడ్రన్ గా సాగుతుందని సమాచారం.
‘అజ్ఙాతవాసి’ చేసిన గాయం నయం అవ్వాలంటే...ఇప్పుడు త్రివిక్రమ్ ఇమిడియట్ గా ఓ హిట్ కొట్టాలి. దాని కోసం ఎంతో కసితో ముందుకెళ్తున్నాడు త్రివిక్రమ్. మరి ఈ సారైనా అనుకున్న టార్గెట్ కొడతాడో... లేదో చూడాలి.
Also Read