మహేష్ సినిమాలో మేజర్ ఛేంజ్!
on Jul 8, 2016
"బ్రహ్మోత్సవం" తర్వాత మహేష్ బాబు బాగా ఆచితూచి సెలక్ట్ చేసుకొన్న ప్రోజెక్ట్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం జూలై 29 నుంచి సెట్స్ కు వెళ్లనుంది. బాలీవుడ్ బొద్దుగుమ్మ పరిణీతి చోప్రాణు కథానాయికగా ఎంపిక చేసి.. ఆమెకు తెలుగు కోచింగ్ క్లాసులు సైతం ఇస్తున్న ఈ చిత్రంలో ఇప్పుడు మేజర్ ఛేంజ్ చోటు చేసుకోనుందని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం దాదాపు 3 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని అడిగింది పరిణీతి, బాలీవుడ్ భామ కదా మార్కెట్ కోసం పనికొస్తుందని సరేనన్నారు నిర్మాతలు. ఇప్పుడు కొత్తగా మరిన్ని కండిషన్లు పెట్టిందట. ఆ కండిషన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకొన్నవే. దాంతో రెమ్యూనరేషన్ కాకుండా మరో 50 లక్షల ఖర్చు అవుతుందట. ఇచ్చేదే ఎక్కువ అనుకొంటుంటే.. మళ్ళీ అదనపు ఖర్చు అవసరమా అని భావించారు నిర్మాతలు. అందుకే పరిణీతి స్థానంలో టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ రకుల్ ను కథానాయికగా ఎంపిక చేసుకొన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలోనే అఫీషియల్ గా సినిమా యూనిట్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది!