నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న లావణ్య!
on Dec 6, 2017
డబ్బులు చిల్లపెంకుల్తో సమానం అయిపోయింది సినిమా రంగంలో. పారితోషికాలు అంటే ఇప్పుడు లక్షల్లో మాటే. స్టార్లయితే... కోట్లే. అయితే... కథానాయికల్లో కోటికి పైన పారితోషికం తీసుకునేవారు మాత్రం తక్కువమందే. నయనతార, అనుష్క, సమంత ఈ లిస్ట్ లో ఉన్నారు. మిగిలిన హీరోయిన్లందరూ లక్షల్లోనే తీసుకునేది. కాజల్, రకుల్, తమన్నా లాంటి హీరోయిన్లు 70 లక్షలు దాకా తీసుకుంటున్నట్లు సమాచారం.
సెకండ్ గ్రేడ్ కథానాయికల్లో దాదాపు అందరూ 50 లక్షలకు లోపే తీసుకునేది. అయితే... లావణ్య త్రిపాఠి మాత్రం తన పారితోషికాన్ని నిర్మొహమాటంగా 50 లక్షలకు పెంచేసింది. అంత ఇస్తేనే చేస్తానని నిర్మాతలకు కరాఖండీగా చెప్పేస్తుంది. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్. అయితే... సదరు నిర్మాతలు కూడా లావణ్యకు యూత్ లో ఉన్న క్రేజ్ ని గుర్తించి.. ఆమె అడిగినంత ఇచ్చుకోడానికి సిద్ధం అవుతున్నారట.
ఇటీవల నిర్మాత సి.కల్యాణ్... లావణ్యను కలిశాడట. సాయిధరమ్ తేజ్, వి.వి.వినాయక్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా లావణ్యను బుక్ చేయడానికి ఆయన వెళ్లాడట. అయితే... లావణ్య... ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేయగానే... ముందు తటపటాయించినా.. తర్వాత...‘ఓకే’ అనేవాడట సి.కల్యాణ్.
అందాలరాక్షసి, దూసుకెల్తా, భలెభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు శుభమస్తు... ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అమ్మాయి.. ఆ మాత్రం అడగడంలో తప్పు లేదులే.. అని చాలామంది అభిప్రాయం.