సుప్రీం ఒప్పుకున్నా.. వాళ్లు ఆడనిస్తారా..?
on Jan 19, 2018
బాలీవుడ్ విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మావత్.. ప్రేక్షకులు ముందుకు రావడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ రాణికథను వక్రీకరిస్తున్నారంటూ రాజ్పుత్ కర్ణీసేన షూటింగ్ను.. సినిమా విడుదలను అడ్డుకుంది. చరిత్రకారుల సూచన మేరకు మార్పులు చేర్పులు చేసిన తర్వాత సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు అనుమతినిచ్చింది. ఇదే సమయంలో పద్మావత్ థియేటర్లలోకి వస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించారు. దీనిపై నిర్మాతలు సుప్రీంకోర్టుకు వెళ్లడం.. అత్యున్నత న్యాయస్థానం ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది.
అయితే రాజ్పుత్ సంఘాలు మాత్రం సుప్రీం ఆదేశాలను ధిక్కరించేలా వ్యవహరిస్తున్నాయి. పద్మావత్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడనివ్వబోమని దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాజ్పుత్ సంఘాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హింసాత్మక, విధ్వంసక చర్యలకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. తమ మాట కాదని సినిమాను విడుదల చేస్తే.. ఆ థియేటర్లను తగులబెడతామని వారు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే పద్మావత్ను థియేటర్లలో కూడా బతకనిచ్చేలా కనిపించడం లేదని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. సినిమా విడుదలై మొదటి షో బయటకు వస్తేనే కాదని అందులో ఏం చూపించారో తెలియదు.. అప్పటిదాకా ఆందోళనలు ఆగవు అంటున్నారు సినీ జనాలు.