అర్జున్రెడ్డికి పిల్లలు .. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది..?
on Nov 30, 2017
ఎంతో కష్టపడి తీసిన సినిమాను జనం చూడాలంటే దానికి బలమైన ప్రమోషన్ ఉండాలి. ఎంతటి స్టార్ సినిమా అయినా ప్రమోషన్ తప్పనిసరి. ఈ విషయం పాటించక బొక్కబోర్లాపడిన సినిమాలు ఎన్నో. గతంలో పోస్టర్లను చాలా అందంగా డిజైన్ చేసి వాటి ద్వారా సినిమాలో ఏ కంటెంట్ వాడారో చెప్పి ఆడియన్స్లో హైప్ క్రియేట్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. టీజర్లు, ట్రైలర్లను బట్టి మూవీలో విషయం ఉందో లేదో చెప్పేస్తున్నారు క్రిటిక్స్. అలాంటి వాటిలో అర్జున్రెడ్డి ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. ఒక బూతు మాట్లాడి హీరో ఎంట్రీ ఇస్తాడు.. ఇక ముద్దులు, హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్తో ఇదేం సినిమా రా బాబు.. చూస్తుంటే ఏదో కొత్తగా ఉందే.. డెఫినెట్గా ఫస్ట్ డే వెళ్లాల్సిందే అన్న క్యూరియాసిటీని తెచ్చింది. అందుకే అర్జున్రెడ్డి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఈ సంగతీని పక్కనబెడితే టాలీవుడ్కు ఒక అలవాటు ఉంది. ఒక జోనర్లో సినిమా హిట్టయ్యితే అదే జోనర్లో కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చి పడుతుంటాయి. సమరసింహారెడ్డి టైంలో ఫ్యాక్షన్.. నువ్వేకావాలి సూపర్హిట్ అవ్వడంతో వరుసగా లవ్ స్టోరీలు థియేటర్లలోకి వచ్చాయి. తాజాగా అర్జున్రెడ్డి ఘనవిజయంతో చిన్న సినిమాలు తీయాలనుకుంటున్న వాళ్లకి ఒక ఫ్లాట్ ఫాం దొరికినట్లైంది. కొద్ది రోజుల క్రితం రిలీజైన దెబ్బకు ఠా దొంగల ముఠా ఈ లిస్ట్లోకే వస్తుంది.
ఇంతకు ముందు హీరోల చేత కానీ.. మూవీలోని మేల్ పర్సన్స్తో మాత్రమే డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించేవారు. కానీ ఈసారి అమ్మాయిల నోటి వెంట బూతులు రావడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. సేమ్ టూ సేమ్ అర్జున్ రెడ్డిలానే ట్రైలర్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని చిత్ర యూనిట్ భావించినట్లుంది. అందుకే దాని నిండా బూతులు నింపేసింది. సినిమాలో ఆడల్ట్ కంటెంట్, రక్తపాతం ఉంటే దానికి ముందే అడ్డుచెబుతుంది సెన్సార్ బోర్డు. అయితే సెన్సార్ కాకముందే ట్రైలర్లో పచ్చిబూతులు దర్శనమిస్తుండటంతో దీనిపై సెన్సార్ బోర్డు ఏం చేయలేకపోతుంది. ప్రస్తుతానికి ఈ ఒక్క సినిమానే అనుకుంటున్నా.. కొత్త సంవత్సరంలో సేమ్ కంటెంట్ మూవీస్ టాలీవుడ్పై దండయాత్ర చేసే అవకాశముంది అంటున్నారు క్రిటిక్స్. మరి వీటిని సెన్సార్ బోర్డు ఏ విధంగా కట్ చేస్తుందో వేచి చూడాలి.