అప్పుడు చెల్లెల్ని ఇచ్చాడు..ఇప్పుడు కూతుర్ని ఇస్తాడా..?
on Jul 12, 2017
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తనయుడు అఖిల్కు, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రేయా భూపాల్కు గతంలో నిశ్ఛితార్థం జరగడం అనూహ్య కారణాలతో వారి వివాహం కార్యరూపం దాల్చకుండా ఆగిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇప్పటికీ ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో సరైన కారణం తెలియదు..సరే ఈ సంగతి పక్కనబెడితే తన పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం దగ్గరపడుతుండటంతో అఖిల్కు కూడా మంచి సంబంధం చూసి ఇద్దరు కుమారులకు పెళ్లి చేయాలని నిర్ణయించారు నాగ్..ఈ మేరకు తనకు తెలిసిన వారితో మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పాడట. వారిలో ఒక పెద్దమనిషి.. హీరో దగ్గుబాటి వెంకటేశ్ కుమార్తె అఖిల్కు సరిజోడి అని ఒక మాట అన్నారట.
.ఆ వెంటనే ఈ విషయంపై అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు మాట్లాడుకున్నాయని..ఈ ప్రతిపాదనకు వెంకీ అంగీకరించారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలోనే వెంకటేశ్తో నాగార్జునకు బంధుత్వం ఉంది. వెంకీ చెల్లెలు లక్ష్మీని నాగ్ వివాహం చేసుకున్నారు..వారి కుమారుడే నాగచైతన్య.. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో చాలా త్వరగా విడాకులు తీసుకుని విడిపోయారు....కారణం ఏదైనా కానీ ఈ వ్యవహారం దగ్గుబాటి కుటుంబాన్ని చాలా ఏళ్లు బాధించింది..కొంతకాలం పాటు అక్కినేని ఫ్యామిలీకి దూరంగా కూడా ఉన్నారట..ఇంత జరిగాక ఇప్పుడు తన కూతురిని ఇవ్వడానికి వెంకీ సిద్ధపడతాడా లేక..? పాత విషయాలు మరచిపోతాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది ఇరు కుటుంబాల్లో ఎవరైనా స్పందిస్తే కానీ నిర్ధారణ కాదు. అప్పటి వరకు టాలీవుడ్కు సస్పెన్స్ తప్పదు.
Also Read