చెర్రీ శ్రీను దానయ్య... ఓ సినిమా
on Apr 10, 2014
రాంచరణ్ హీరోగా మరో చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయంపై నిర్మాత మాట్లాడుతూ... "మా సంస్థలో "దేశముదురు", "జులాయి", "నాయక్", "కెమెరామెన్ గంగతో రాంబాబు"... వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఇపుడు మరోసారి చరణ్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మిగిలిన వివరాలు త్వరలోనే చెబుతాము" అన్నారు.
ప్రస్తుతం చరణ్ "గోవిందుడు అందరివాడేలే" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అదే విధంగా శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న "ఆగడు" చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.