చెర్రీ ఏంటయ్యా ఈ రచ్చ!
on Jul 4, 2016
రామ్ చరణ్ స్వతహా పబ్లిసిటీ ప్రియుడేమీ కాదు. కానీ.. ఈమధ్య మనోడుకి పబ్లిసిటీ పిచ్చ పట్టిందని, ఆ పిచ్చతో రచ్చ చేస్తున్నాడని ఫిలిమ్ నగర్ టాక్. రామ్ చరణ్ తన మునుపటి సినిమాల షూటింగ్స్ ను ఎక్కడో దేశవిదేశాల్లో ముగించుకొని తిరిగి హైద్రాబాద్ చేరుకొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఎప్పుడూ లేనిది.. మొన్న మన భారతదేశం మ్యాప్ లో మకుటంలా కనిపించే కాశ్మీర్ వెళ్ళొచ్చేసరికి మాత్రం "చరణ్ కాశ్మీర్ నుంచి తిరిగొచ్చాడు" అంటూ చరణ్ హైద్రాబాద్ లో బ్యాగ్ పట్టుకొని నడుచుకొంటూ వస్తున్న ఫోటోలతో సహా ఓ ప్రెస్ నోట్ ను వదిలారు.
సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ఒకటి పూర్తయ్యిందని చెప్పడం ఒకే కానీ.. మరీ వెటకారంగా "బాబు హైద్రాబాద్ వచ్చాడు, బాబు ఎయిర్ పోర్ట్ లో దిగాడు" అని న్యూస్ లు పంపడం చూస్తుంటే.. చరణ్ పరిచయ చిత్రం "చిరుత"లో ధర్మవరపు హీరోయిన్ నేహాశర్మ చేసే పనుల గురించి ధర్మవరపు తండ్రి పాత్రధారి అయిన ప్రకాష్ రాజ్ కు ఫోన్ చేసి "పాప నిల్చుంది సార్, పాప పడుకుంది సార్, పాప నడుస్తుంది సార్" అని చెప్పినట్లుగా ఉంది.
మరి ఈ విషయాన్ని చరణ్ కాస్త పట్టించుకొని.. తన స్టార్ డమ్ ను డీగ్రేడ్ చేసే పిచ్చి పబ్లిసిటీని కాస్త పక్కన పెడితే మంచిదని మెగాభిమానులతోపాటు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు!