శర్వానంద్ తో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'...
on Feb 27, 2015
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు మేర్లపాక గాంధీ. తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందించాడు. అయితే ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర గడుస్తున్నమరో సినిమా సెట్ కాలేదు. అక్కినేని సుశాంత్ తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ఏమైందో ఈ సినిమా ముందుకు కదలడం లేదు. దీంతో ఇప్పుడు మరో హీరోతో లాగించేస్తున్నాడు గాంధీ. ఇటీవల వెవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తన స్థానం పదిలం చేసుకుంటున్న శర్వానంద్ కి కధ చెప్పడం, అందుకు శర్వా ఓకే అనడం జరిగిపోయింది. శర్వానంద్ తో 'రన్ రాజా రన్' చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.