‘రంగస్థలం’ కథ ఇదేనా?
on Jan 23, 2018
సినిమా విడుదలకు ముందే కథలు లీకైపోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. చిన్నా చితకా సినిమాల విషయంలో ఇలా జరిగితే ఫర్లా. కోట్ల ఖర్చుతో చేస్తున్న సినిమాల కథలు లీకవ్వడం నిజంగా బాధాకరమైన విషయమే. రీసెంట్ గా చరణ్ ‘రంగస్థలం’ సినిమా కథ ఇదే అని ఓ లైన్ హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో నిజానిజాలు ఏంటో తెలీదు కానీ.. ముందు వినిపిస్తునన కథేంటో చూద్దాం.
అది 1960... పచ్చని పొలాలతో.. గోదారి పరవళ్లతో... అమాయకమైన మనసులతో ఆహ్లాదంగా ఉండే గ్రామం అది. , జగపతిబాబు, ప్రకాశ్ రాజ్... ఇద్దరు ఆ ఊరు మోతుబరులు. వీరిద్దరి గొడవలు ఆ ఊరు ప్రశాంతతను దెబ్బ తీస్తుంటాయ్. అయితే... అనుకోకుండా రైతులకు...ఈ మోతుబరులకు జరిగిన గొడవలో... రైతు నాయకుడైన రాజీవ్ కనకాల బలైపోతాడు. అయితే... రాజీవ్ కనకాలను కావాలనే చంపారా? లేక పొరపాటున ఆ హత్య జరిగిందా? అనేది మాత్రం ఎవరిక అర్థం కాని విషయం.
అతనికి ఒక్కగానొక్కడుకు రామ్ చరణ్... తండ్రి లేని కొడుగ్గానే పెరిగి పెద్దవుతాడు.కథ... 80ల్లోకి చేరుతుంది. అయితే... ఒక రోజు అనుకోని పరిణామం వల్ల... తండ్రి చావుకు అసలు కారణం తెలుస్తుంది చరణ్ కి. తన తండ్రి గొడవల్లో దెబ్బ తగిలి చనిపోలేదు. కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా చంపారు. ఈ విషయం తెలుసుకున్న చర్రీ... తండ్రికి చావుకు కారణం ఎవరో తెలుసుకునే పనిలో పడతాడు.చివకు తండ్రిని చంపిన వాళ్ల ఆటకట్టిస్తాడు.
ఈ కథకు అనుబంధంగా.. చరణ్, సమంతల ప్రేమకథ కూడా నడుస్తుంది. ఇందులో సమంత పాత్ర పేరు లక్ష్మి. చరణ్ పేరు చిట్టిబాబు. పల్లెటూరి అమ్మాయిగా సమంత పాత్ర చాలా విభిన్నంగా సాగుతుందని సమాచారం.
‘రంగస్థలం’ కథ ఇదే... అంటూ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న కథ ఇదేనండీ. మరి ఇందులో నిజానిజాలు దేవునికే తెలియాలి.
ఇదిలావుంటే... ఆది పినిశెట్టి... ప్రభుత్వాధికారిగా ఓ వైరైటీ పాత్ర చేస్తున్నాడు. యాంకర్ అనసూయ పోలీస్ అధికారిగా నటిస్తోంది. దాదాపు వంద కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కుస్తున్నాడు.
కథ పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగినా... 80ల్లో నాటి కథే అయినా... సుకుమార్ స్టైల్ ఎక్కడా మిస్ అవ్వదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 20 ఏళ్ల వ్యవధిలో సాగే కథ ఇది. అప్పటి వాతావరణాన్ని తలపించేలా సెట్ల నిర్మాణం జరిగింది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.
Also Read