తండ్రీకొడుకుల దెబ్బ నుంచి ఇప్పటికి తేరుకొన్నారు!
on Jul 24, 2016
తొలుత చిన్న బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వచ్చి.. అనంతరం మహేష్ బాబుతో "బిజినెస్ మ్యాన్", నాగార్జునతో "ఢమరుకం" లాంటి భారీ బడ్జెట్ సినిమాల్ని రూపొందించే స్థాయికి చేరుకొన్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఆ తర్వాత నాగార్జున తనయుడు నాగచైతన్యతో తెరకెక్కించిన "ఆటోనగర్ సూర్య" అనంతరం మళ్ళీ కనిపించలేదు. "ఢమరుకం, ఆటోనగర్ సూర్య" సినిమాలు వరుసగా భారీ నష్టాలు మిగల్చడంతోపాటు డిస్ట్రిబ్యూట్ చేసిన ఇతర చిత్రాలూ ఘోరంగా పరాజయం పాలవ్వడంతో పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటివరకూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కొంత మంది ఎన్నారై స్నేహితుల సహకారంతో మళ్ళీ ఓ మీడియం బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందట. ఎప్పట్లానే అచ్చిరెడ్డి సారధ్యంలో కాస్త పేరున్న కొత్త హీరోతో ఓ యూత్ ఫుల్ సినిమా తీయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి తండ్రీకొడుకుల (నాగార్జున, నాగచైతన్య) దెబ్బ నుంచి తేరుకోవడానికి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థకు రెండేళ్లు పట్టిందన్నమాట!