Facebook Twitter
మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా పాటల నివాళి

 

మహాకవి శ్రీ శ్రీ జయంతి  సందర్భంగా పాటల నివాళి 

 

రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని  తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. నేడు ఆ మహాకవి వర్థంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఆయనరచనల్లో1950లోప్రచురించబడిన'మహాప్రస్థానం'అనేకవితాసంపుటి తెలుగుసాహితీఅభిమానులమనసుల్లోనేకాకుండా..సామాన్యప్రజల
గుండెల్లోకూడాచిరస్థాయిగానిలిచిపోతుంది.

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్నిశాసించిన మహాకవి శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధకవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవరచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు.

కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నతెలుగు సాహిత్యంలో కవితను ఇలానిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవిలేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది అన్న బూదరాజురాధాకృష్ణ గారి మాటలు శ్రీశ్రీ సాహితీ ప్రజ్ఞ్య కి నిదర్శనాలు.

1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. (మునిసిపల్ రికార్డుల ప్రకారం శ్రీశ్రీ పుట్టినరోజు ఏప్రిల్, 30, 1910. అయితే తాను ఏప్రిల్‌లో జన్మించినప్పటికీ  స్కూలు అవసరాల నిమిత్తం తన తండ్రి తన పుట్టినరోజును జనవరి 2, 1910 అని రాయించారని శ్రీశ్రీ తన ‘అనంతం’ పుస్తకంలో పేర్కొన్నారు. విప్లవ రచయితల సంఘం కూడా మునిసిపల్ రికార్డులను పరిశీలించి శ్రీశ్రీ పుట్టినరోజు ఏప్రిల్ 30, 1910 అని నిర్ధారించింది) శ్రీరంగం సూర్యనారాయణకు దత్తత వెల్లటం వలన ఈయనఇంటిపేరు శ్రీరంగంగా మారింది.
1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణిపత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయనరాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్పకవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశను మార్చిన పుస్తకం అది.1947 లోమద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నో సినిమాలకు పాటలు,మాటలు రాసాడు.

1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది.
ఆసందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది.

శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు.
తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు.
ఈ రచనను సాంప్రదాయ పధ్ధతి లోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సువంటి వాటిని పక్కన పెట్టి వాడుకభాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం మొదలు పెట్టారు.

 1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నతస్థానంలో నిలిచి శ్రీశ్రీ ని
మహాకవి ని చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టిఅనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియోనాటికలు రచించాడు.
మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకుతెలియదు. 1981 లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం కు ముందుమాటలో ఆయన
ఈ విషయంస్వయం గా రాసాడు.

తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను
ఆయనరచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీరలేవరా.. అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తోకలిసి సినిమాలకు మాటలు రాసాడు. ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు.
అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలోశ్రీశ్రీ మేటి.

తెలుగు కవిత్వానికి దిశా నిర్దేశం చేసిన శ్రీ శ్రీ అమరుడు..  ఈ రోజు ఆ మహాకవి వర్థంతి సంధర్బంగా మరోసారి తెలుగు కవితా రథసారధికి అక్షర నివాళి అర్పింద్దాం..

శ్రీశ్రీ జయంతి సందర్భంగా చిన్న పాటల నివాళి

శ్రీరంగం శ్రీనివాసరావు కంటే శ్రీశ్రీ అంటేనే ఠక్కున గుర్తుపడతారు తెలుగువారెవరైనా శ్రీశ్రీ గారిని. విప్లవ భావాలని, పదాల మాటున అంత శక్తివంతంగా ఇమిడేలా చేయగలగిన శ్రీశ్రీని కవిగా ఆరాధించేవారెందరున్నారో... మనసు, మమత, బంధాల గురించి అలతి అలతి పదాలతో అందంగా వర్ణించే శ్రీశ్రీని అభిమానించే సినీప్రియులు అందరే ఉన్నారు. వెయ్యికి పైగా తెలుగు సినీ గీతాలు  రాశారు శ్రీశ్రీ.  వాటిలో ఎన్నెన్నో ఆణిముత్యాల్లా ఇప్పటికీ మెరుస్తూనే ఉన్నాయి. శ్రీశ్రీ గారి పాటలనగానే ఆయన సాహిత్యంలా విప్లవభావాలతో రక్తాన్ని మరిగించేలా ఉంటాయనుకుంటాం. అయితే మనసున మనసై అంటూ మనసు భాషకి అర్థం చెప్పే పాటలు ఎన్నో రాశారు శ్రీశ్రీ. ఉదాహరణకి మాంగల్యబలం సినిమాలో '' వాడిన పూలే వికసించనే '' పాట వింటుంటే తెలియని ఆనందం మనసుని పట్టి ఊపెస్తుంది.  

 అలాగే మరొక ఉదాహరణ తీసుకుంటే ఆత్మగౌరవంలోని '' వలవు విరిసిన పూవులే '' పాట కూడా అంతే !

ఇక ప్రేమలేఖలు సినిమాలోని పుట్టినరోజు పాటలో ఓ మనిషి పుట్టుక అలాగే ప్రేమ పుట్టుకలని కలబోసి రాసిన విధానం నిజంగా అద్బుతమని చెప్పొచ్చు. '' ఈ రోజు మంచి రోజు మరపురానిది మధురమైనది..మంచితనం ఉదయించిన రోజు '' అనే పాటని జాగ్రత్తగా వినండి. ఎంత అందంగా రెండు భావాలని ఒకేపాటలో పలికించారో !

ఇక శ్రీశ్రీ మార్కు పాటల గురించి చెప్పేదేముంది చెప్పండీ. యమగోల లోని సమరానికి నేడే ప్రాంరంభం అంటూ అన్యాయంపై గళమెత్తిన పాట అయినా!

సర్థార్ పాపారాయుడు చిత్రంలోని '' వినరా సోదరా '' పాట అయినా మనలో ఆవేశాన్ని పొంగించక మానవు. ఈ పాటలో '' ఒక యోధుని మరణం శత వీరుల జననం స్వేచ్చ నిమిత్తం చిందిన నెత్తురు వృధా కాబోదు '' ఈ మాటల తూటాలు నేరుగా మన గుండెల్లో పేలతాయి.

ఇక మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పాట వింటుంటే రక్తం మరగటం అంటారే అదేంటో రుచి చూస్తాం మనం.

శ్రీశ్రీ పాటల పూదోట ఏంతో విశాలమైనది. కొన్ని పాటల పరిమాళాలని పరిచయం చేసుకున్నాం. మరికొన్ని మరోసారి. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా చిన్న పాటల నివాళి ఇది.