Facebook Twitter
దేవులపల్లి కృష్ణశాస్త్రి

ఆంధ్ర షెల్లీ....దేవులపల్లి కృష్ణశాస్త్రి

కండ్లకుంట శరత్ చంద్ర

        కృష్ణశాస్త్రి కులం కోయిల కులం, కృష్ణశాస్త్రి మతం హృదయమతం.కృష్ణశాస్త్రి మార్గం స్వేఛ్చ మార్గం ! " నేను హృదయవాదిని, నాకు వేదాంతం,తర్కం తలకెక్కవ్ ! " అన్నారు కృష్ణశాస్త్రి. అప్పటివరకూ పద్యా కవిత్వమే కవిత్వం అనుకునే వారికి వచనంలోనూ కవిత్వం రాయగలమని నిరూపించిన కృష్ణశాస్త్రి. 1897 లో జన్మించినఈ కవి 'స్వేచ్చ'యే తన కవిత్వపు పునాదిగా చేసుకుని కవిత్వం రాసాడు. " ఆకులో ఆకునై , పువ్వులో పువ్వునై , ననులేత రెమ్మనై ,సెలయేటిలో పాటనై, తెరచాటు తేటినై , నీలంపు నిగ్గునై..." " జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అని రాముడు, లక్ష్మణునడితో అంటాడు . జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ..." అంటాడు. దేవులపల్లి, దేశభక్తిని గుర్తుచేస్తూ.

    1921 లో ఆరంభించి,1925 లో పూర్తి చేసిన అయన "కృష్ణ పక్షం" కవిత సుగంధాలు , నేటికీ ఇగిరిపోలేదు. మానవతావాదం , భక్తి వాదం ,దేశ భక్తి, వేదన, ప్రకృతి ఆరాధన ... ఇవీ అయన కవితలలోని అంశాలు.

రెండు ప్రపంచ యుద్దాల వల్ల ఏర్పడిన ఆర్దిక సంక్షోభాలు,1922 లో.. అంటే 25 ఏళ్ళ వయసులో భార్య మరణం , సామజికంగా అలముకున్న నిరాశ... ఇవన్ని ఆయన కవిత్వంలో విషాదలుగా ప్రతిబింభిస్తాయి.అందుకే P.B Shelley లాగా ఈయన కవిత్వంలో హృదయాన్ని తట్టే Melancholy వుంటుంది.ఈయనను ' ఆంధ్ర షెల్లీ' అని పిలవ సాగారు.

              " కృష్ణపక్షం" లో వేదననూ, విషాదాన్ని పలికించాకా "ప్రవాసం" " ఊర్వశి" రాసాడు. 'హృదయనాళం తెగెయె, హృదయధనము తొలగిపోయెను,జీవిత ఫలము స్రుక్కి నేలబడె' అంటూ "కృష్ణ పక్షం" లో రాస్తే .. "పాటయై పక్షియై, ఆశయై,హయియై ,దేసదిసల మిరునో దివ్య పడమంటునో" అని రాసాడు. ఊర్వశి లో. "ప్రేయసి ! ప్రేయసీ ఓ యమవస్యా తమస్విని !గగన సీమంతునీ! నా సఖీ! నీ దీర్ఘాధమిల్ల నీ ల వల్లీచ్ఛాయ పోడిచికొని, నిదుర విడిచి పూవులు నేడు ..." అంటాడు " ప్రేయసీ !ప్రేయసీ !" అనే కవితలో .

          1925 లో " కృష్ణపక్షం " రాగానే విమర్శకులూ, పద్యకవులూ ఈయన కవిత్వాన్ని చీల్చి చెండాడారు . కవిత్వాన్ని భ్రష్టుపట్టించాడన్నారు . నెలకు రెండు పక్షాలు . ఒకటి కృష్ణపక్షం రెండు శుక్లపక్షం. కృష్ణశాస్త్రి చీకటి నిండే కృష్ణ పక్షాన్ని తన కవితా సంపుటి పేరుగా పెట్టాడని .. అదంతా చెత్త కవిత్వమని చెప్పేలా ఒకాయన " శుక్లపక్షం " అనే వెక్కిరింపు కావ్యం రాసాడు. ఆ కావ్యం ఎవరికీ ఎక్కలేదు కానీ కృష్ణ పక్షం అజరామరమయ్యే కీర్తి సంపాదించుకుంది. కృష్ణ శాస్త్రి ఏనాడూ విమర్శకులకి సమాదానం ఇవ్వలేదు. యువకులు మాత్రం అయన కవిత్వపు శైలిని , ఆయన గిరజాల జుట్టు.. శాలువతో కూడిన అయన ఆకారాన్ని అనుకరించడం మొదలుపెట్టారు.

     కృష్ణ శాస్త్రి గారు ఎన్నో సభలలో తియ్యగా కవిత్వ గానం చేసారు.1964లో ఆయన గొంతు ,కాన్సర్ వల్ల మూగదయ్యింది.ఐతే ఆయన కలం ఆగలేదు . కవిత్వ పరిమళాలను విరజిమ్మింది.ఆయన కవిత్వంపై ఎందరో పి.హెచ్.డి లూ చేసారు .మల్లేశ్వరిలో "ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు .." రాజమకుటంలో సడిసేయకోగాలి.' సుఖదుఃఖలలో " ఇది మల్లెల వేళాయని , ఇది వెన్నెల మాసమని ..." ఉండమ్మ బొట్టుపెడతాలో " రావమ్మా మహా లక్ష్మి రావమ్మా .." ఏకవీర లో "ప్రతి రాత్రి వసంత రాత్రి ,ప్రతి గాలి పైరగాలి " భక్తతుకారంలో " ఘన ఘన సుందరా కరుణా రసమందిరా ""శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో " నా పేరు బికారి నా దారి ఎడారి .." సీతా మహలక్ష్మిలో " మా విచిగురు తినగానే కోయిల పలికెన " గోరింటాకు లో " గోరింట పూచింది కొమ్మాలేకుండా " కార్తీకదీపం' ఇలా ఎన్నో సినిమాలలో హిట్ సాంగ్స్ .రాశి తక్కువే కానీ వాసి ఎక్కువ.

     ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి "కళ ప్రపూర్ణ " కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పద్మభూషణ్ అవార్డు పొందారు.

  1980 లో కృష్ణ శాస్త్రి మరణించినపుడు " తెలుగుదేశపు నిలువుటద్దం బ్రద్దలయ్యింది. షెల్లీ మళ్ళీ మరణించాడు . వసంతం వాడిపోయింది అన్నాడు శ్రీ శ్రీ కృష్ణ శాస్త్రికి ఓ స్మృత్యాంజలి ఘటిస్తూ....