* మూకుడులో సన్నగా చిన్నగా తరిగిన ఉల్లి ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద... కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరప ముక్కలు వేసి.. నూనెలో వేయించుకోవాలి.
* ఈ కూర దగ్గర పడేదాకా వేయించుకుని ఉప్పు, పసుపు వేయాలి. పులుపు మరికాస్త కావాలనుకుంటే చింతపండు రసం వేసుకోవాలి.
* ధనియాలపొడి, కారం, గరంమసాలా వేసి ఉడకనివ్వాలి.. ప్రక్క స్టవ్ మీద మరీ పలుచగా కాకుండా మరీ దళసరిగా కాకుండా మధ్యస్థంగా పెసరట్లు చిన్నగా బాగా దోరగా కాలేలావేసుకుని...
* 2, 3 అట్లు వేసుకున్నాక.. వాటిని చిన్న ముక్కలుగా తెంపుకుని.. ఈ కూరలో వేసి బాగా కలిపి.. కూరపైన కొత్తిమీర, పాలమీగడ (లేక) నేయి వేసి అలంకరించుకోవాలి. ఈ కూర అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.