వెన్న ఉండలు - క్రిష్ణాష్టమి స్పెషల్
 

 

కావలసిన పదార్ధాలు..

* వెన్నపూస   -   1 కప్పు

* వరిపిండి      -  1 కప్పు 

* ఉప్పు           -  చిటికెడు 

* ఇంగువ        -  చిటికెడు 

* వాము         -   కొద్దిగా  

* నువ్వులు     -  1 స్పూన్ 

 

తయారు చేసే విధానం:

* ముందుగా పొడి (లేదా) తడి వరి పిండిలో... ఉప్పు, ఇంగువ, వాము, నువ్వులు కలిపి.. అందులో తాజా వెన్న (లేదా) వైట్ బటర్ వేసి పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. 

* అనంతరం ఆ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ... ఆ ఉండల్ని కాగే నూనెలో వేసి స్టవ్ పై మంట తగ్గించి దోరగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని .... వెన్న ఉండలు క్షణంలో తయారవుతాయి.