సోయాబీన్స్ కర్రీ రెసిపి

 

 

 

కావలసిన పదార్ధాలు :
సోయాబీన్స్- 200 గ్రాములు
ఆలూ - 1
టమాటాలు -2
పచ్చికొబ్బరి - అరకప్పు
అల్లంవెల్లుల్లి ముద్ద -1 స్పూను
పుదీనా ఆకులు -ఒక  కట్ట
ఉప్పు -రుచికి తగినంత .
పచ్చి మిర్చి - 5
ఇలాచీ - 4
లవంగాలు-2
క్యారెట్ -3
ఉల్లిపాయలు -2
నూనె -1/2 కప్పు
ఆవాలు-1 స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
పసుపు - చిటికెడు ,

 

తయారు చేసే పధ్ధతి :

 

ముందు రోజు  రాత్రి సోయాబీన్స్ నానపెట్టుకోవాలి. తరువాత  వాటిని  ఉడికించుకోవాలి. అలాగే  క్యారెట్,ఆలూ ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా  ఉడికించుకోవాలి. ఇప్పుడు  మసాలా దినుసులు అన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చికొబ్బరి , పుదీనా ఆకులు కూడా పేస్ట్ చేసి మసాలా పేస్ట్ తో కలిపెయ్యాలి. తరువాత స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టి నూనె   పోసి అందులో ఆవాలు , ఉల్లిపాయ ముక్కలు ,టమాటా ముక్కలు ,ఉప్పు ,పసుపు వేసి కలిపి ముత పెట్టి ఉడికించాలి.ఇప్పుడు అందులో ఉడికించిన సోయాబీన్స్,ఆలూ,క్యారెట్ వేసి సరిపడా నీళ్ళు పోసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి .తరువాత మసాలా పేస్ట్ ను వేసి బాగా కలిపి కొంచంసేపు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి...