రాజ్మా పులావ్

 


 

కావలసిన పదార్ధాలు:
రాజ్ మా : ఒక కప్పు
ఉల్లిపాయలు : రెండు
బియ్యం : రెండు గ్లాసులు
కొత్తిమీర ఒక కట్ట
నెయ్యి : నాలుగు టీ స్పూన్స్
ఉప్పు : తగినంత
పచ్చిమిర్చి : ఆరు
అల్లం,వెల్లుల్లి ఫేస్ట్ : ఒక టీ స్పూన్
టమోటాలు : రెండు
కారం : ఒక టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
ధనియాలపొడి : అర టీ స్పూన్
గరంమసాలా : 2 గ్రాములు

 

తయారీ :
ముందుగా రాజ్ మా గింజలను ముందురోజు రాత్రి  నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని కాస్త ఉప్పు వేసి ఉడుకించుకోవాలి. బియ్యాన్ని కూడా కడిగి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నెపెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, గరంమసాలా వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాలపొడి, పుదీనా వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు టామాటా ముక్కలు, ఉడికించుకున్న రాజ్మా వేసి కలిపి మరో పది నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించి కొంచం మందంగా ఉన్న గిన్నె పెట్టి అందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి మరగబెట్టి నీళ్ళు పొంగుతుప్పుడున్న  నానబెట్టిన బియ్యాన్ని వేసి తగినంత ఉప్పు కలిపి మూత పెట్టాలి. మూడు వంతులు ఉడికిన తర్వాత అన్నాన్ని దించేసుకోవాలి. ఓ గిన్నెలో సగం అన్నాన్ని ఓ పొరలా వేయాలి. తర్వాత రాజ్ మా కూరను వేయాలి. తర్వాత మిగిలిన అన్నాన్ని వేసి స్టవ్ మీద పెట్టి అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత దించుకోవాలి.చివరిలో కొత్తిమీర చల్లుకొని వేడి వేడి గా  రాజ్మా పలావు సర్వ్ చేసుకోవాలి