అండు కొర్రల ఉప్మా

 

 

 

కావలసిన పదార్ధాలు:

అండు కొర్రల రవ్వ - 3 కప్పులు

పచ్చి సెనగ పప్పు - ఒక టేబుల్‌ స్పూను

ఆవాలు - ఒక టీ స్పూను

నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు

టొమాటో తరుగు - పావు కప్పు

మినప్పప్పు - ఒక టేబుల్‌ స్పూను

ఉల్లి తరుగు - పావు కప్పు

అల్లం తురుము - ఒక టీ స్పూను

జీలకర్ర - ఒక టీ స్పూను

ఉప్పు - తగినంత

తరిగిన పచ్చి మిర్చి - 4

కరివేపాకు - 2

క్యారట్‌ తరుగు - పావు కప్పు

 

తయారుచేసే విధానం:

ముందుగా స్టౌ మీద బాణలి వేడయ్యాక అండుకొర్రల రవ్వను వేసి నూనె వేయకుండా దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తరిగిన ఉల్లి, పచ్చి మిర్చి తరుగు, క్యారట్‌ తురుము, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు వేసి మరోమారు కలియబెట్టాక, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి, మరిగించాలి. వేయించి ఉంచుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతుండాలి. మంట బాగా తగ్గించి బాగా మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి... అంతే వేడివేడి అండు కొర్రల ఉప్మా రెడీ.. దీన్నికొబ్బరి లేదా అల్లం చట్నీతో కలిపి తింటే భళే రుచిగా ఉంటుంది.