బెంగాలీ కిచిడీ  (అష్టమి స్పెషల్)

 


 

 

 

 

దుర్గా పూజల్లో అమ్మ వారికి అష్టమి నాడు తప్పక పెట్టే నైవేద్యం

 

కావలసిన పదార్ధాలు:

* బియ్యం (బాసుమతి లేక సాదా) - 1 కప్పు కాస్త వెలితిగా
* పెసరపప్పు - 1 కప్పు నిండుగా
* పసుపు - తగినంత
* నేయి - 2 - 3 స్పూన్లు
* ఉప్పు - తగినంత
* జీలకర్ర - 1 స్పూన్
* ఎండు మిరపకాయలు - 2
* పలావు ఆకు - 1
* దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి - 3 చొప్పున
* కాయగూరలు - కాలిఫ్లవర్ మొగ్గలు, ఆలూ ముక్కలు, పచ్చిమిర్చి, బఠాణి, బీన్స్.. అన్నీ కలిపి ఒక కప్పు
* పంచదార - 1/2 స్పూన్
* ఎర్రకారం - 1 స్పూన్

 

తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ లేదా దళసరి గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల నేయి వేసి పెసర పప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరికొంచెం నేయి లేక నూనె తీసుకొని.. అందులో ముందుగా దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి (కొద్దిగా దంచి), పలావు ఆకు, జీలకర్రతో వేసి వేయిస్తూ కడిగిన కూరగాయ ముక్కల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. అందులో ముందు వేయించి పెట్టుకున్న పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి కొలతగా 3 to 4 గ్లాసులు సుమారుగా చూసుకొని పోసి అందులో పసుపు, ఉప్పు, చక్కెర, కారం కలిపి కుక్కర్ 3,4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు రెడీ అయిన కిచిడీ ని కొంచంసేపు చల్లారనిచ్చి దానిపై నేతిపోపు ఎండుమిరప జీలకర్రతో కలిపి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. దీనికి అప్పడం జోడించి తింటే.. ఇక ఆరుచికి సాటి రాదు ఏదీ..

 

--భారతి