అన్నం పరమాన్నం

 

(వరలక్ష్మి వ్రతం స్పెషల్)

 

 

కావలసిన పదార్ధాలు:

1/2 కప్పు - బియ్యం(నానబెట్టినవి)

1 లిటర్ - పాలు

1/2 కప్పు - బెల్లం

1/4 స్పూను - యాలుకల పొడి

3 స్పూన్లు - డ్రై ఫ్రూట్స్ ముక్కలు

 

తయారీ విధానం:

ముందుగా నానబెట్టిన బియ్యాన్ని మరుగుతున్న పాలలో వేసి బాగా ఉడుకు అందుకున్న తరువాత చక్కెర కలపాలి. మరో 15 నిమిషాలు ఉడికిన తరువాత బియ్యం మెత్తబడిన తరువాత యాలుకల పొడి కలిపి మరి కొంచెంసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం ముక్కలుగా దంచి కలపాలి..లేత పసుపురంగులో చక్కని పాయిసం తయారవుతుంది. దానిని తినే ముందు డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని జోడించాలి.

 

-భారతి