ఆలూ స్టఫింగ్ మిర్చీ బజ్జీ

 

 

 

కావలసినవి :
కావలసిన పదార్థాలు:
బజ్జీ పచ్చిమిర్చి - పావుకేజీ
బంగాళాదుంపలు: అర కేజీ
కారం: 1టేబుల్ స్పూన్
గరం మసాలా: 1టేబుల్ స్పూన్
చాట్ మసాలా: 1టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు: 1టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
శెనగపిండి: 250 గ్రాములు
బేకింగ్ సోడా: 1టేబుల్ స్పూన్
కారం: 1టేబుల్ స్పూన్
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి తగినంత

 

తయారీ :
ముందుగా పచ్చిమిర్చిని మంచినీళ్ళలో వేసి బాగా కడిగి ఒక ప్లేట్ లోనికి తీసుకొని, తడి ఆరిన తర్వాత ఒక మద్యకు పొడవుగా కట్ చేసి గింజలను తీసి పక్కన పెట్టుకోవాలి.
 బంగాళాదుంపలకు ఉడికించి తర్వాత పొట్టుతీసి మెత్తగా చేసుకుని ఇందులో  కారం, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, గరం మసాలా మరియు ఉప్పు వేసి బాగా కపుకోవాలి. మిర్చి ఎన్ని వున్నాయో అన్నీ బాగాలుగా కలిపినా మిశ్రమాన్నీ ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు  కట్ చేసి పెట్టుకొన్న మిర్చీలోనికి బంగాళాదుంప మిశ్రమాన్ని ఒక్కో మిర్చిలోపల పెట్టాలి. ఇలా అన్ని మిర్చీలు నింపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, కారం, ఉప్పు, తగినన్నినీళ్ళుపోసి ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి  నూనె పోసి వేడయ్యాక స్టఫ్డ్ మిర్చినీ శెనగపిండి మిశ్రమంలో ముంచి  నూనెలో వేసి  బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.