ఆలూ పూరీ రెసిపి

 

 

కావలసిన పదార్థాలు:

బంగాళదుంపలు - పావుకేజీ

జీలకర్ర - ఒక  స్పూను

మైదా - 200 గ్రాములు

పచ్చిమిర్చి - 6

కొత్తిమీర తరుగు - ఒక కట్ట

కారం - ఒక  స్పూను

మిరియాలు - అర స్పూను

నూనె - వేయించడానికి సరిపడా

నెయ్యి - 1 స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

 

తయారు చేయు విధానం:

 ముందుగా ఉడికించిన, పొట్టు తీసిర పెట్టుకొన్నాక బంగాళాదుంపల్ని ఒక బౌల్లోనికి తీసుకొని మెత్తగా  చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి  అందులో జీలకర్ వేసి వేయించి, పక్కకి తీసి  ఒక గిన్నెలో మైదా పిండి వేసి అందులో ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపను, వేయించి పెట్టుకొన్న జీలకర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కారం, మిరియాలు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పూరీల పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పిండిని తీసుకొని ఉండలు లా చేసి చపాతీలా ఒత్తి పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె, పోసి బాగా మరిగించి అందులో రెడీ చేసి పెట్టుకున్న పూరీలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తీసి సర్వింగ్ బౌల్ పెట్టుకోవాలి. దీనికి ఏ కర్రీ అయినా కాంబినేషన్ బావుంటుంది.