RELATED NEWS
NEWS
నిరసన ర్యాలీ ఫర్ పాకిస్థాన్

 

అమెరికన్ ఇండియన్ కమ్యూనిటీ మరియు అమెరికన్ ఫ్రెండ్స్ అఫ్ బలూచిస్తాన్ కలిపి నిర్వహించిన "నిరసన ర్యాలీ ఫర్ పాకిస్థాన్ " దిగ్విజయముగా జరిగింది. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ దేశం టెర్రిరిజంకి నిధులు అందిచడం , మైనారిటీస్ ఐన హిందువులు , సిక్కులు, బలూచిస్తాన్ మీద భౌతిక  దాడులు చేయడం లాంటి వంటివి ఫై నిరసన చేపట్టారు.

పాకిస్థాన్ దేశం, టెర్రిరిజంని మిగితా దేశాలకు పంపడం , కాశ్మీర్ / ఉరి లో ఆర్మీ ఫై జరిగిన దాడి, న్యూ యార్క్ ,న్యూ జెర్సీ లో జరిగిన బాంబుల కుట్ర వెనుక నిందితుడు పాకిస్థాన్ తో సంబంధాలు ఉండడం, పాకిస్థాన్ దేశం ను టెర్రిరిజం దేశం గా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి ని డిమాండ్ చేసారు.


పౌరులపై పాశవిక దాడుల కుట్రలన్నీ కూడా పాకిస్థాన్‌లోనే జరుగుతున్నాయని పలు దేశాలు కూడా ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో కృష్ణ రెడ్డి ఏనుగుల, అడపా ప్రసాద్,  జయేష్ పటేల్ , విలాస్ రెడ్డి జంబుల, నీలిమ మదన, శ్రీకాంత్ తుమ్మల, ఫణి భూషణ్, రామ్ వేముల, బాలగురు, ఆనంద్, రవి తదితరులు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;