RELATED NEWS
NEWS
డల్లాస్‌లో ‘మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా’

అమెరికాలోని డల్లాస్‌లో మహాత్ముడికి నివాళిగా ‘మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా’ ఏర్పాటైంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది డల్లాస్‌లో మహాత్ముడి నివాసం‌గా పేర్కొనవచ్చు. ఈ ప్లాజా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అనేక సమావేశాలు, ఆలోచనలు పంచుకోవడంతోపాటు శాంతి ర్యాలీ కూడా జరిగింది. ఐదు సంవత్సరాల కఠోర శ్రమతో డల్లాస్‌లోని ప్రవాస భారతీయులు ఈ ‘మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా’కు రూపకల్పన చేశారు. అమెరికాలో భారతీయ వాణిని వినిపించడానికి ఈ ప్లాజా ఒక కేంద్రంగా వుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని మతాలకు చెందినవారి కృషితో రూపొందిన ఈ ప్లాజా డల్లాస్‌లో భారతీయతకు చిహ్నంగా నిలుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని భారతీయుల ఐక్యతకు, గాంధీజీ సిద్ధాంతాల వ్యాప్తికి ఈ ప్లాజా ఏర్పాటు సహకరిస్తుందని పలువురు భావిస్తున్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;