RELATED NEWS
NEWS
People For Loksatta Campaign on Telangana Issue

పీపుల్ ఫర్ లోక్ సత్తా మరియు ఎన్నారైల ఆధ్వర్యంలో లాస్ ఏంజలీస్ లోని తెలుగువారందరూ తెలంగాణ సమస్యని త్వరితగతిన పరిష్కరించమని భారత సర్కారుని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. శనివారం (నవంబర్ 19) మద్యాహ్నం 12 గంటలకు లాస్ ఏంజలీస్ లోని, ఎన్నారైలు అధికంగా వుండే అర్టీసియా ప్రాంతంలో ప్రదర్శన తలపెట్టారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సమస్యకు పరిష్కరారం కాక గత రెండు సంవత్స్తారాలుగా ప్రాంతీయ విభేదాలు పెరగటం, రాష్ట్ర అభివృద్ది కుంటుపడటం, సకల జనుల సమ్మె, ఆత్మహత్యలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు గురికావటం జరుగుతోంది. అయినా అధికార పక్షం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమస్యని పరిష్కరించే దిశగా స్పష్టమైన అడుగులు వేయటం లేదు. ఈ సమస్యతో రాష్ట్రంలో పరిపాలన కూడా కుంటుపడిపోయింది.

 

2009 డిసెంబర్ 9న, 23న పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలని తప్పుదోవ పట్టించినట్లు కాకుండా, అందరికి న్యాయం జరిగే పరిష్కారం చూపించి, దాని మీద గట్టిగా నిలబడాలని లాస్ ఏంజలీస్ లోని తెలుగువారు కోరుతున్నారు. ప్రభుత్వం వారి తీర్పుని ప్రకటించేటప్పుడు దాని వెనక వున్న హేతుబద్ధమైన ఆలోచన మరియూ ఐక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు కలిగిన, అలాగే విడిపోతే సీమాంద్ర ప్రజలకు కలిగే సాధకబాధకలు, కష్టనష్టాలేవి అని అన్నీ ప్రాంతాల వారికి అర్ధమయ్యేట్టు వివరించమని డిమాండ్ చేస్తున్నారు.


TeluguOne For Your Business
About TeluguOne
;