MEMORIES
కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి 125 వ జయంతి

కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి 125 వ జయంతి "కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి 125 వ జయంతి సందర్భంగా న్యూయార్క్ లో జరిపిన సభ జయప్రదంగా, తానా ఫౌండేషన్ పూర్వాధ్యక్షులు తిపిర్నేని తిరుమల రావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిధులుగా పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు గారు, డాక్టర్ నరిసెట్టి ఇన్నయ్య గారు వచ్చారు. బసవరాజు రఘువర్మ గారు డాక్టర్ ఇన్నయ్య గారిని, తిరుమల రావు గారు యార్లగడ్డ వారిని సభకు పరిచయం చేసారు. కవిరాజు గారి హేతువాద విప్లవ భావాలను, వారి దేశ భక్తి ప్రబోధ రచనలను డాక్టర్ నరిసెట్టి గారు, ప్రొఫెసర్ యార్లగడ్డ గారు సభికులకు విశదీకరించారు. సభకు విచ్చేసిన వారిలో డాక్టర్ పోలవరపు రాఘవ రావు, తులసి గార్లు, ఆళ్ళ పూర్ణచంద్రా రెడ్డి, ఉష గార్లు, పైళ్ల మల్లా రెడ్డి గారు, అనుమోలు సుబ్బారావు గారు, గడ్డం దశరధరామ రెడ్డి గారు, పోలవరపు కృష్ణ, అరుణ, జొన్నవిత్తుల శ్రీనాద్, డాక్టర్ మధు కొర్రపాటి ఇత్యాది ప్రముఖులు సుమారుగా ఒక యాభై మంది వున్నారు. సభ విందుతో ముగిసింది.”

TeluguOne For Your Business
About TeluguOne
;