INTERVIEWS
చికాగోలో ఘనంగా ప్రారంభమైన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు

చికాగోలో ఘనంగా ప్రారంభమైన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు

తరలివచ్చిన తెలుగు అతిరథ మహారథులు



ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలు ఈసారి చికాగో వేదికగా ప్రారంభమయ్యాయి.. బాంక్వెట్ కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథమహారథులు విచ్చేశారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంట, సుజన ఆచంట వెంటరాగా,  ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ రచయిత, భాషా కోవిదులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ , తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి, ఎన్.ఆర్.ఐ పారిశ్రామికవేత్త ముక్కామల అప్పారావులు జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు.

 


భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ దానికి తగ్గట్టుగా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందనేది నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్యాం మద్దాళి వివరించారు. తెలుగు సంఘాల చరిత్రలో  తొలిసారిగా నాట్స్ చేపట్టిన హెల్ఫ్ లైన్, స్టూడెంట్ బీమా పథకాల గురించి మద్దాళి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కూడా  శ్యాం మద్దాళి తెలిపారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లను శ్రీధర్ అప్పసాని సభకు పరిచయం చేశారు. చికాగోలోని తెలుగువారి ఈ మూడు రోజుల సంబరాలను విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ తరపున ఉత్తమ సేవలు అందించిన వారితో పాటు.. నాట్స్ నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. బాంక్వెట్ కార్యక్రమంలో సంగీత విభావరి, మిమిక్రి రాజు చేసిన మిమిక్రి అందరినీ అలరించింది. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సాయి కుమార్ తో పాటు,  హాస్య నటుడు పృధ్వి , హీరో నిఖిల్,  జబర్దస్త్ కామెడీ టీం, ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, తెలంగాణ టీడీపీ నేత ఇ.పెద్దిరెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు ఈ బాంక్వెట్ లో పాల్గొన్నారు. దువ్వాడ జగన్నాథమ్ (డీజే) టీం  కూడా సంబరాల్లో  సందడి చేయనుంది. అమెరికాలోని తెలుగువారికి అంతులేని సంతోషాలను ఈ సంబరాలు పంచనున్నాయి. బావార్చీ బిర్యానీ వారి విందు బహు పసందు అని ప్రశంసలందుకొంది.

TeluguOne For Your Business
About TeluguOne
;