సౌత్ ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ పిరియడ్ లో ఫుడ్ హోం డెలివరీలకు ప్రభుత్వాలు అనుమతించాయి. దాదాపు 72 మంది పిజ్జా ఆర్డర్ చేసుకున్న వారికి ఈ బాయ్ డెలివరీ ఇచ్చాడట. అధికారులు వీరి రక్త శాంప్లిస్ను కూడా సేకరిస్తున్నారు. వారందరినీ హోం క్వారెంటైన్ లో ఉంచారు.
పిజ్జా డెలివరీ బాయ్ డయాలసిస్ పేషెంట్ అట. అతను ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. అక్కడే కరోనా వైరస్ అంటుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు అతను పిజ్జా డెలివరీ చేయగా, ఇటీవల అతనిలో కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వైరస్ హాట్ స్పాట్ కేంద్రాల్లో సౌత్ ఢిల్లీ కూడా వుంది.
అనుకున్నదంతా అయ్యింది..ఏదైతే జరక్కూడదని కేంద్రప్రభుత్వం భయపడిందో అదే జరిగింది. పవిత్ర అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పంజా విసిరారు. నిన్న రాత్రి అనంతనాగ్ జిల్లాలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఎస్కార్ట్ వ్యాన్పై నిన్న రాత్రి 8.20 గంటల ప్రాంతంలో సాయుధులైన ముష్కరులు దాడి చేశారు..వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే మీదకు వస్తున్న అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ముష్కరుల తూటాలు తగిలడంతో ఏడుగురు యాత్రికులు మరణించగా..11 మంది గాయపడ్డారు..వీరంతా అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని వస్తున్నారు..అయితే రాత్రి 7 గంటల తర్వాత యాత్రా బస్సులు హైవే మీదకు తిరగకూడదని కానీ డ్రైవర్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుంది పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు..ఇలాంటి పరికిపంద చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
చాలా రోజుల నుండి ప్రశాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని గలందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీనిలో భాగంగానే భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. జతీయరహదారిపై కొంతసేపు వాహన రాకపోకలను నిలిపివేశారు. ఈ సమయంలో, భద్రతాదళాలపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేయడానికి సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించి... గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా ఎనిమిది మంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హెచ్ సీయూలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీసీగా అప్పారావు మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టడంతో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వీసీ నివాసం పై దాడిచేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వీసీ అప్పారావు రాజీనామా చేయాలంటూ విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్ర మంత్రివర్గంలో ఒక వికెట్ పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని గత కొంతకాలంగా రాజీనామా చేస్తూ ప్రభుత్వంలో అసమ్మతి నాయకుడిగా మారిన మంత్రి నారాయణ్ రాణే రాజీనామా చేశారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను తప్పితే, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని రాణే చెబుతున్నారు. తనకు పక్కలో బల్లెంలా మారిన రాణేని పృథ్విరాజ్ చౌహాన్ వ్యూహాత్మకంగా మంత్రివర్గం నుంచి తానే తొలగిపోయేలా చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పృథ్విరాజ్ చౌహాన్ని ముఖ్యమంత్రి సీటు నుంచి తప్పించి రాణేని ముఖ్యమంత్రి చేస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు రాణేనే మంత్రి పదవిని వదలాల్సి వచ్చింది. దీనినే రాజకీయం అంటారేమో!
దక్షణాఫ్రికాలో పర్యటించే భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ఈ రోజు ప్రకటించింది. గత కొంతకాలంగా ఫిట్ నేస్ సమస్యలతో జట్టులో చోటును కోల్పోయిన పేసర్ జహీర్ ఖాన్ తిరిగి జట్టులో చోటును సంపాదించాడు. అయితే ఓపెనర్లు గౌతమ్, సెహ్వాగ లకు మరోసారి నిరాశ తప్పలేదు. అంబటి రాయుడుకు ఈసారి అవకాశమిచ్చారు.
భారత్ దక్షిణాఫ్రికా ఇన్విటేషనల్ ఎలెవన్ జట్టుపై భారత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత మొదటి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 18వ తేదీ నుంచి న్యూ వాండరర్స్లో జరుగుతుంది. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ డిసెంబర్ 25వ తేదీ నుంచి దర్బన్లోని కింగ్స్మీడ్లో జరుగుతుంది. భారత్ డిసెంబర్ 5,8,11 తేదీల్లో దక్షిణాఫ్రికాపై వరుసగా జోహన్నెస్బర్గ్, దర్బన్, సెంచూరియన్ల్లో మూడు వన్డే మ్యాచులు ఆడుతుంది.
వన్డే జట్టు: మహేంద్ర సింగ్ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, అజింక్యా రహనే, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్
టెస్టు జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహనే, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ, ప్రజ్ఞాన్ ఓజా, ఇషాంత్ శర్మ
భారత్ పర్యటనలో వెస్టిండీస్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. విశాఖపట్న౦లో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది. డారెన్ సామి 45బంతుల్లో 63 పరుగులు చేసి విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత కోహ్లి 99, ధోని 51 నాటౌట్ గా నిలిచి ఇండియాకు 288 పరుగులను అందించారు.
289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చార్లెస్ 12, ఆతరువాత వచ్చిన శామ్యూల్స్ 8 పరుగులు చేసి వెంటనే అవుటయ్యారు. ఈ స్థితిలో విండీస్ ను పావెల్, డారెన్ బ్రావో శతక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఆ తరువాత సిమన్స్ 62, డారెన్ సామి 63 పరుగులు చేసి వెస్టిండీస్ కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో విశాఖలో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.
భారత్, వెస్టిండీస్ మధ్య రేపు విశాఖపట్నంలో జరగనున్న రెండో వన్డే కు వర్షం ఆటంకంగా మారె అవకాశం ఉంది. రెండు రోజులుగా విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మైదానం మొత్తం నీటితో నిండివుంది. అత్యాధునిక డ్రైనేజ్ విధానం కలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో మ్యాచ్ ఆరంభానికి కనీసం ఆరు గంటలకు ముందు వర్షం నిలిచిపోతే మ్యాచ్ నిర్వాహణకు ఎటువంటి ఆటంకం ఉండదని ఎసిఎ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి మ్యాచ్ సాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాయంత్రం ప్రాక్టీస్కు మైదానం అనుకూలిస్తుందని భావిస్తున్నారు. రెండో వన్డే మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇరు దేశాల జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నాయి.
ప్రపంచ చెస్ సరికొత్త చాంపియన్ గా యువ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ ఆవిర్భవించాడు. సొంతగడ్డపై ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు షాకిచ్చాడు. నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్ తొలిసారిగా ప్రపంచ చాంపియన్షిప్ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పదో రౌండ్ను డ్రా చేసుకున్న కార్ల్సన్ 12 గేమ్ల ఈ మ్యాచ్లో మరో రెండు రౌండ్లు మిగిలుండగానే టైటిల్ను ఎగరేసుకుపోయాడు.
పది రౌండ్లు ముగిసే సరికి 6.5-3.5తేడాతో చాంపియన్గా నిలిచాడు. ఈ పది రౌండ్లలో మూడు గేమ్లు నెగ్గిన కార్ల్సన్, ఏడు గేమ్లు డ్రా చేసుకున్నాడు. కాగా, సొంతగడ్డపై నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆనంద్ ఒక్క గేమ్లో కూడా విజయం సాధించలేకపోయాడు. ఆనంద్ 2000, 2007, 2008, 2010, 2012లో ప్రపంచ చాంపియన్షిప్ టైటిళ్లు సాధించాడు. ఆనంద్ తన 22 ఏళ్ల కెరీర్లో కనీసం ఒక్క విజయం కూడా లేకుండా ప్రపంచ చాంపియన్షిప్ను ముగించడం ఇదే తొలిసారి.
ఐపిఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో జైలుకు వెళ్లిన బెయిల్ పై బయటకు వచ్చిన క్రికెటర్ శ్రీశాంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. శ్రీశాంత్ వివాహం గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో డిసెంబర్ 12న జరగనుందని శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి తెలిపారు. రాజస్థాన్ కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన నయన్ తో శ్రీశాంత్ వివాహం జరగనుంది. వీరిద్దరూ గతకొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీశాంత్ జైలుకి వెళ్ళిన సమయంలో నయన్ ఆసరాగా నిలిచి, తన ప్రేమను చాటుకుంది. దాంతో వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు కూడా ఒప్పేసుకున్నారు. శ్రీశాంత్ పెళ్లి వివరాలు త్వరలోనే మరిన్ని తెలియనున్నాయి.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కెరీర్ చివరి మ్యాచ్లో 74 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. శుక్రవారం ఉదయం జోరుతో ఆట ప్రారంభించిన సచిన్ 112 బంతుల్లో 12 ఫోర్లతో 74 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సచిన్ ఆట తీరు చూసేందుకు యూపీఏ వైస్ ప్రెసిడెంట్ రాహుల్గాంధీ, నటులు అమీర్ఖాన్, హృతిక్ రోషన్, వెంకటేష్ పలువురు ప్రముఖులు స్టేడియంకు తరలివచ్చారు. సచిన్ పెవిలియన్ వెళ్లే సమయంలో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. ఈ క్రమంలో సచిన్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు. వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 221 పరుగులతో ఆధిక్యంలో ఉంది.
భారత్, వెస్టిండిస్ మధ్య గురువారం ప్రారంభమైన రెండవ టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన విండీస్ 55.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండిస్ ఆటగాళ్లలో పోవెల్ 1 సిక్సర్, 4 ఫోర్లతో 48 పరుగులు కొట్టగా మిగిలిన బ్యాట్స్మెన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో విండీస్ 200 పరుగులు కూడా చేయకుండానే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో ఓజా 5 వికెట్లు, అశ్విన్ 3, కుమార్, షమి చెరో వికెట్ట పడగొట్టారు.
ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్ కు ముగింపు పలికే ఆ పోరు ఈ రోజు మొదలైంది. క్రికెట్లో ఓనమాలు దిద్దిన ముంబై గడ్డపైనే ఈ పరుగుల వేటగాడు ఆఖరి ఆట ఆడుతున్నాడు. తన 200వ టెస్ట్తో తన పరుగుల దాహానికి పరిసమాప్తి పలుకనున్నాడు. మ్యాచ్ జట్ల మధ్యే జరుగుతున్న దృష్టంతా ఆ ఒక్కడిపైనే...ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మ్యాచ్ లోనూ సచిన్ పై భారీగా అంచనాలున్నాయి. సచిన్ టెండూల్కర్ శతకంతో కెరీర్ కు ముగిస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు మొదటి మ్యాచ్ లో విజయంతో జోరు మీదున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి మాస్టర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్లోనైనా గెలిచి భారత అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లాడానికి వెస్టిండీస్ సిద్దమైంది.