పవార్ పవర్ పాలిటిక్స్! మోడీ టార్గెట్ గా బైడెన్ డైరెక్షన్..
Publish Date:Mar 1, 2021
Advertisement
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో ఎన్టీఆర్ కాబోతున్నారా? జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా బలమైన కూటమి రూపుదిద్దుకోనుందా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 1989లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్.. అప్పడు కేంద్రంలో అధికారంలో ఉంటూ అత్యంత శక్తివంతంగా ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, నేతలను ఏకం చేశారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ కూటమి అప్పట్లో రాజకీయ సంచలనమైంది. ఎన్టీఆర్ బాటలోనే ఇప్పుడు శరద్ పవార్ కూడా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి ఏర్పాటు చేయబోతున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ చీప్ కేజ్రీవాల్.. పవార్ కు ఫుల్ సపోర్టుగా ఉంటున్నారు. ఇటీవల గుజరాత్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. సూరత్ కార్పొరేషన్ ను గెలుచుకుని బీజేపీ వర్గాలకు షాకిచ్చింది. గుజరాత్ ఫలితాల జోష్ తో దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో ఆప్ ను విస్తరించేందుకు కేజ్రీవాల్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో శరద్ పవార్ కూటమిలో శరద్ పవార్ సారథ్యంలో ఏర్పడబోయే కూటమిలో వామపక్షాలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. సీపీఎం సీనియర్ నేతలు ప్రకాశ్ కారత్ , సీతారం ఏచూరీలు ఇప్పటికే పవార్ తో చర్చలు జరిపారు. గతంలో ఎన్టీఆర్ కూటమిలోనూ వామపక్షాలు ముఖ్య పాత్ర పోషించాయి. కాంగ్రెస్ అసమ్మతి టీమ్ కూడా పవార్ వెనుక ఉంది. పార్టీ నాయకత్వం తీరును ఎండగడుతూ గతంలో 23 కాంగ్రెస్ సీనియర్ నేతలు.. సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు కలకలం రేపారు. జీ23గా పిలవబడుతున్న ఆ నేతలో శనివారం జమ్మూలో గులాం నబీ ఆజాద్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఆ వేదిక నుంచే మరోసారి అధినాయకత్వంపై అసమ్మతి గళం వినిపించారు. ఈ నేపథ్యంలో ఆజాద్ నేతృత్వంలో కాంగ్రెస్ జీ23 శరద్ పవార్ కూటమి గురించి మరో చర్చ కూడా జరుగుతోంది. ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రిగా ఎవరు ఉంటారనేది ప్రశ్నగా మారింది. కూటమికి సారథ్యం వహించే పవారే పీఎంగా ఉంటారని ప్రచారం జరిగినా.. తనకు ప్రధాని కావాలన్న కోరిక లేదని స్పష్టం చేశారు పవార్. ప్రత్యామ్నాయ కూటమిని ముందుడి నడిపిస్తాను కాని.. ప్రధాని పదవిని బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే కూటమికి బయటి దేశాల నుంచి మద్దతు ఉంది. ముఖ్యంగా అమెరికాలో అధికారంలో ఉన్న జోబిడెన్ టీమ్ బీజేపీ వ్యతిరేక కూటమికి సపోర్ట్ చేయబోతుంది. గత నవంబర్ లో జరిగిన యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ప్రధాని మోడీ సపోర్ట్ చేశారు. ఎన్నికలకు ముందు ఇండియాకు వచ్చిన ట్రంప్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ట్రంప్ కోసం మోడీ ఓపెన్ సపోర్ట్ చేయడంపై గుర్రుగా ఉన్న జోబిడెన్.. బీజేపీని ఓడించేందుకు కొత్త కూటమికి మద్దతు ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న తాజా పరిణామాలతో దేశ రాజకీయాల్నని పవార్ చుట్టూనే తిరుగుతున్నాయి.
మఫ్లర్ మెన్ కీ రోల్ పోషించబోతున్నారు. ఎంఐఎం కూడా దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే నాలుగైదు రాష్ట్రాల శాసనసభల్లో అడుగు పెట్టింది. దేశంలోని ముస్లింలో పట్టు సాధించేలా ఎత్తులు వేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ కూడా పవార్ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండనున్నారు.
బెంగాల్ లో బీజేపీతో యుద్ధం చేస్తున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, డీఎంకే అధికారం చేపడుతుందని సర్వేలు చెబుతున్న స్టాలిన్,జమ్మూకశ్మీర్ లో బలమైన నేతలుగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా, అతని కొడుకు ఒమర్ అబ్దుల్లా కూడా శరద్ పవార్ తో చేతులు కలపబోతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే,
అతని కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా పవార్ కూటమిలో చేరబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కూడా పవార్ తో మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నా.. చివరి వరకువాళ్లను నమ్మలేమనే అభిప్రాయంతో పవార్ టీమ్ ఉంది. తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ , ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీలతో పాటు తికాయత్ కూడా పవార్ తో కలిసి పని చేయబోతున్నారు.
నేతలంతా శరద్ పవార్ తో కలిసి పని చేయనున్నారు. పవార్ కూటమికి ఆజాదే కర్త, కర్మ , క్రియ.
చేపట్టబోనని చెప్పారు. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అంగీకరిస్తే.. అతన్ని పీఎం అభ్యర్థిగా ముందుండనున్నారు.
http://www.teluguone.com/news/content/sharad-pawar-will-lead-new-front-in-india-against-bjp-39-110926.html