63 మంది ఎమ్మెల్యేలకు నో ఛాన్స్!
Publish Date:Mar 1, 2021
Advertisement
151 మంది ఎమ్మెల్యేలు. 22మంది లోక్ సభ, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు. చట్ట సభల్లో అట్టహాసంగా కొలువుదీరింది జగన్ రెడ్డి ప్రభుత్వం. కాలం గిర్రున తిరిగింది. 21 నెలలు ముగిసింది. పాలు, నీళ్లు తేటతెల్లమవుతున్నాయి. జగన్ రెడ్డి అసలు స్వరూపం బట్టబయలవుతోంది. పార్టీ అధినేతగా ఆయనో మోనార్క్. ప్రభుత్వాధినేతగానూ అదే వన్ మ్యాన్ షో. వైసీపీకి ఆయనే సుప్రీం. సర్కారుకూ ఆయనే షో మ్యాన్. మరి, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల మాటేంటి? వారు ఎందుకూ పనికి రాని షో పీస్ లా? జగన్ దర్బార్ లో వారికి అసలు ప్రాధాన్యతే లేదా? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ అంతర్గత వర్గాలు. వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 151. గ్రాండ్ ఫిగర్. అసెంబ్లీలో ఫుల్ పవర్. చెప్పుకోడానికి వాళ్లంతా ఎమ్మెల్యేలే. అయితేనేం.. జగన్ ముందు అంతా మోకరిల్లాల్సిందే. కనీసం ముఖ్యమంత్రిని కలవాలన్నా పడిగాపులు పడాల్సిందే. అయినా, సీఎం దర్శనం కలిగితేగా. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 151 మంది ఎమ్మెల్యేల్లో 63 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని కలవలేదట. ఎన్నిసార్లు అడిగినా ఆ ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదట. నియోజక వర్గ సమస్యలు చెప్పుకుందామని, పార్టీ మేటర్ డిష్కస్ చేద్దామని సీఎం ఇంటికి వెళితే.. వారిని కలిసేందుకు జగన్ కు నో టైమ్. ఆ.. వారినేంటి కలిసేదనే ఫీలింగ్. ఇలా అనేక మంది తాడేపల్లిలోని జగన్ నివాసానికి రావడం.. సీఎంను కలవకుండానే తిరిగి వెళ్లిపోవడం జరిగిపోతోందట. ఇప్పటి వరకు సీఎం జగన్ ను ఒక్కసారి కూడా కలవని ఎమ్మెల్యేల సంఖ్య.. అక్షరాలా 63 అని లెక్కేసి మరీ చెబుతున్నారు వైసీపీ వర్గాలు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం అంటున్నారు. అసెంబ్లీ కొలువుదీరినప్పుడు సైతం జగన్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను కలిసేది ఉండదు. దూరం నుంచే అలా నమస్కారం చేసి తన కుర్చీలో తాను కూర్చుంటారు. పార్టీ శాసన సభా పక్ష సమావేశాల్లోనూ ఇదే తీరు. ఎమ్మెల్యేలంతా ఒకవైపు.. డయాస్ పై జగన్ ఒక్కరూ మరోవైపు. సారొస్తారు. చెప్పాల్సింది చెప్పేస్తారు. వెళ్లిపోతారు. అంతే. ఎమ్మెల్యేలను కలిసేది.. వారితో మాట్లాడేది.. వారు చెప్పేది వినేది అంటూ ఏమీ ఉండదు. అక్కడ ప్రజాస్వామ్య పద్దతులు ఉండవు. అంతా నియంత్రుత్వమే. అదే జగన్ స్టైల్. ది రూలర్. ఎమ్మెల్యేలనే కాదు ఎంపీలతోనూ అదే తీరు. వైసీపీకి 22+6 ఎంపీలు ఉంటే.. వారిలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలకు మాత్రమే జగన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇస్తారట. మిగతా పార్లమెంట్ సభ్యులు జగన్ ను కలవాలంటే అస్సలు కుదరదట. ఎంపీలైనా వారితో భేటీకి ముఖ్యమంత్రి ఆసక్తి చూపరని చెబుతున్నారు. ఈ రెండేళ్లలో సీఎంతో మీటింగ్ కు ఎన్నిసార్లు ప్రయత్నించినా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ లభించలేదట. వారంతా ఒక్కసారి కూడా జగన్ తో ఫేస్ టూ ఫేస్ భేటీ అవలేదంటే నమ్మాల్సిందే. ఇక ముఖ్యమంత్రే పట్టించుకోకపోతే నియోజక వర్గంలో పెండింగ్ పనులెలా పూర్తయ్యేది? గ్రామస్థాయిలో చిన్న చిన్న సమస్యలు ఉంటే.. వాలంటీర్లతో పని అయిపోతోంది. అందుకే, కింది స్థాయిలో ఎమ్మెల్యేకంటే వాలంటీర్లకే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటోంది. ఇక పెద్ద సమస్యలేవైనా ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళితే.. ఆ పని పూర్తి చేయడం సదరు ప్రజాప్రతినిధికి చాలా కష్టం అవుతోందట. ఎంతకీ సీఎం అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో.. పనులన్నీ అలానే పెండింగ్ లో ఉంటున్నాయట. పనులు చేయించలేక కేడర్ లో పరువు పోతోంది. ముఖ్యమంత్రి తమను పట్టించుకోవడం లేదని బయటకు చెబితే పరపతి పోతుంది. అందుకే, కక్కలేక, మింగలేక.. అనేక మంది వైసీపీ ప్రజాప్రతినిధులు తెగ ఇదై పోతున్నారని అంటున్నారు. జగన్ రెడ్డి నియంత్రుత్వ పోకడలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆప్ లైన్లో అనేక ఆరోపణలు చేస్తున్నారు. మైక్ ముందుకు వచ్చే సరికి జననేతంటూ తెగ పొగుడుతున్నారు. తేలు కుట్టిన నేతల్లా.. లోలోన మదనపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/no-appointment-for-ycp-mlas-to-meet-cm-jagan-39-110941.html