Read more!

స్వచ్ఛ భారత్ చిహ్నంగా ముసలావిడ..

 

కేంద్ర ప్రభుత్వం తాను చేపట్టిన స్వచ్ఛ భారత్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన కేంద్రం ఇప్పుడు స్వచ్ఛ భారత్ చిహ్నాన్ని ప్రకటించనుంది. అయితే ఎవరో సెలబ్రిటీ అనుకుంటున్నారేమో.. ఒక ముసలావిడను స్వచ్ఛ భారత్ చిహ్నంగా ప్రకటించనున్నారు. కున్వర్ బాయి అనే 105 సంవత్సరాల ముసలావిడను ఈ నెల 17న ‘స్వచ్ఛ దివస్’ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ‘స్వచ్ఛభారత్’ చిహ్నంగా ప్రకటించనున్నారు. ఆమెనే స్వచ్ఛ భారత్ చిహ్నంగా ఎందుకు ఎంపిక చేశారంటే.. ఆమె తన దగ్గర ఉన్న ఎనిమిది మేకలను అమ్మి ఆ డబ్బుతో మరుగుదొడ్డి నిర్మించింది. ‘స్వచ్ఛభారత్’ స్ఫూర్తిని ఆమె తన వరకే పరిమితం చేసుకోలేదు. చుట్టుపక్కల వారికి దీనిపై అవగాహన కల్పించింది. గతంలో ఒకసారి ఛత్తీస్ గఢ్ వెళ్లిన ప్రధాని మోదీ, ఈ విషయం తెలసుకుని ఆమెను అభినందించారు.. ఆమె పాదాలకు నమస్కరించారు. దీంతో ఆమెను స్వచ్చ భారత్ చిహ్నంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది.