బస్సులో మంటలు.. 9 మంది మృతి
posted on Apr 21, 2015 @ 1:04PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వున్న బస్సులో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది మరణించారు. దుర్ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.