Read more!

నేడు కర్నూలులో ముఖ్యమంత్రి పర్యటన

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు పధకాన్ని, చెరువులలో పూడికతీత కార్యక్రమాలని ఆయన ఆరంభిస్తారు. జిల్లాలో బానకచర్ల హెడ్-రెగ్యులేటరీ పనులను పరిశీలించిన తరువాత ‘అవుకు’ రిజర్వాయర్ లో పూడిక తీత పనులనుఆయన ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర సంక్షేమ పధకాలు, స్వచ్చా భారత్ కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహించబోతున్నట్లు సమాచారం.