Read more!

తెలుగు రైతులతో మోడీ కాన్ఫరెన్స్‌


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రైతులతో మాట్లాడారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌లోని రైతులతో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల ద్వారా పొందుతున్న లబ్ధి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తాము ఎదుర్కొంటున్న క‌ష్టాలు, వారు అవ‌లంబించాల‌నుకుంటున్న నూత‌న ప‌ద్ధ‌తుల‌పై మోదీకి వివ‌రిస్తున్నారు. తాము గతంలో పత్తి, జొన్న, మొక్కజొన్న సాగుచేసి నష్టపోయామని.. శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రస్తుతం అశ్వగంధ ఔషధ పంటను సాగుచేస్తున్నట్లు ఓ రైతు ప్రధానికి తెలిపారు. అశ్వగంధ పంటను మధ్యప్రదేశ్‌లో మార్కెట్‌ చేస్తూ హెక్టారుకు రూ.10-15వేల వరకు లాభాలు ఆర్జిస్తున్నట్లు చెప్పాడు. కొత్త వంగడాలు అందిస్తే అధిక దిగుబడులు సాధిస్తామని పాడేరుకు చెందిన రైతు ప్రధానికి వివరించాడు. అంతేకాదు త‌మ‌కు సాంకేతిక ప‌రిజ్ఞానం అందించాల‌ని కోరారు.