Read more!

తెలంగాణ టీడీపీకి షాక్.. నేడు కారెక్కనున్న ఎంపీ మల్లారెడ్డి..

 

ఒక పక్క ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలోకి ప్రతిపక్ష పార్టీ నేతలు వరుస పెట్టి వలసలు పోతుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్దంగా పార్టీ నేతలు టీడీపీకి హ్యాండ్ ఇస్తున్నారు. తెలంగాణ టీడీపీ నుండి మొత్తం 15 ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో ఇప్పటికే అందరూ టీఆర్ఎస్లో చేరారు. ఇంకా ఓ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు. ఇప్పుడు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఎంపీ మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఎప్పటి నుండో ఆయన టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అంతేకాదు ఓ బహిరంగ కార్యక్రమంలో ఆయన కేసీఆర్ పనితీరును పొగిడేశారు. దీనిపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినా తాను మాత్రం వాస్తవాలే మాట్లాడుతున్నానని సమర్థించుకున్నారు. దీంతో ఆయన కూడా టీఆర్ఎస్లోకి వెళతారంటూ వార్తలు వచ్చాయి. కానీ, అప్పుడు ఆయన కొంత వేచిచూశారు. చివరకు ఇప్పుడు రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో ఆయన తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. ఈరోజు మల్లారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.