Read more!

డిసెంబర్ వరకూ నీరు పంపడం కుదరదు..

 

కావేరి జల వివాదం రోజు రోజుకి ముదురుతుంది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో కర్ణాటక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలుపెట్టారు. ఈ నెల 27 నుండి కావేరి నది నుండి తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని చెప్పగా.. కావేరిలో తగినంత నీరు లేకపోవడం వల్ల నీటిని విడుదల చేసేది లేదని ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తేల్చి చెప్పేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. 6 వేల క్యూసెక్కుల నీటితో పాటు మరో 42 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని ఆదేశించిన నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు మరింత నీటిని విడుదల చేయడం కష్టమని.. ఈ వివాదంలో సుప్రీం కోర్టు తన తీర్పును మార్చుకోవాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. అదనంగా ఇవ్వాల్సిన 42వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు విడుదల చేయడం కుదరదని.. డిసెంబర్ వరకూ విడుదల చేయలేమని చెప్పారు. మరి దీనిపై ఎంత రచ్చ జరుగుతుంతో చూడాలి.