Read more!

కేసీఆర్ పై బీజేపీ ఫైర్

 

టీఅర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై జీజేపీ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తమ పార్టీ నేతలకే అవకాశం కల్పిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్ర రావు, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజసింగ్ రాథోడ్‌లు గంటసేపు సచివాలయం సీ బ్లాక్ ముందు బైఠాయించారు. నగరంలో చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అంతా టీఆర్ఎస్ నాయకులే ఉంటారా? అని ప్రశ్నించారు. మిగిలిన ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములు చేయాలని నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నేతలను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆపార్టీ వర్గాలు కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టారు.