Read more!

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. అన్నిరాష్ట్రాల సీఎంల‌తో మోడీ మీటింగ్

దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ రేపు(మంగళవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా సెకండ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో... ఆయా రాష్ట్రాలలో పరిస్థితులు, కరోనా వ్యాప్తి తీవ్రత, అలాగే వ్యాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై మోడీ ఈ భేటీలో సీఎంలతో చర్చ జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆంక్ష‌లు కూడా విధించిన నేపథ్యంలో ప్రధాని, సీఎం ల సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ రెండు దఫాలుగా జరగనుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ పై నీతి ఆయోగ్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్‌కు ఎంత ధర నిర్ణయించాలన్న విషయం కూడా నీతి ఆయోగ్ సభ్యుల మధ్య చర్చకు వచ్చింది. అంతేకాకుండా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాని వ్యాక్సిన్‌లను ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయాలన్నిటి పైనా ప్రధాని మోదీ సీఎంల అభిప్రాయాన్ని తీసుకొని.. వాటిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.